జమ్మూకశ్మీర్ ప్రాంతంలో మొదటిసారి కోబ్రా యూనిట్ అడుగుపెట్టబోతోంది. కోబ్రా యూనిట్ అనేది సీఆర్పీఎఫ్ లోనే అత్యున్నత దళం. ఈ యూనిట్లో మానసికంగా, శారీరకంగా కఠిన శిక్షణ తీసుకున్న సైనికులు ఉంటారు.
26 వేళ్లతో ఓ పాప జన్మించడంతో ఆ గ్రామస్తులంతా దేవతగా భావిస్తున్నారు. ఆ పాపకు పూజలు చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఆ పాప జన్యుపరమైన సమస్యతో జన్మించినట్లు చెప్పారు.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. సూర్యుడి గురించి అధ్యయనం చేయడంలో పనుల వేగాన్ని పెంచినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
పోస్టల్ శాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా రూ.6 వేలు అందించే స్కాలర్షిప్ కోసం పరీక్షల సమాచారం గురించి తెలియజేసింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కీమ్ కింద స్కాలర్ షిప్ అందించనున్నట్లు వెల్లడించింది.
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ముర్ము, హోమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఢిల్లీలో మెట్రో ప్రారంభం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం(telangana liberation day) వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా ఈ దినోత్సవం గురించి పలు పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) హాజరయ్యారు.
కేరళ(kerala)లో నిఫా వైరస్(nipah virus) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి ప్రభావం కోజికోడ్ జిల్లాలో ఎక్కువగా ఉన్న క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 24 వరకు సెలవులను ప్రకటించింది.
కేరళ భౌగోళిక స్థానాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మానవులలో చాలా వ్యాధులు జంతువులతో సంపర్కం కారణంగా సంభవిస్తాయి. కేరళలో ఒకవైపు అడవి, మరోవైపు సముద్రం. రెండింటిలోనూ వివిధ రకాల జంతువులు ఉన్నాయి. వాటితో సన్నిహిత్యం కారణంగా ఆ వ్యక్తి వ్యాధికి గురవుతాడు.