రూ.2 వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. బ్యాంకింగ్ ద్వారా తమకు 87 శాతం నోట్లు మాత్రమే అందాయని, ఇంకా రూ.12000 కోట్లు విలువైన నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు.
తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
ఓ పండుగ సందర్భంగా అనేక మంది నదికి స్నానానికి వెళ్లారు. కానీ వారిలో పలువురు తిరిగి రాలేదు. ఆ క్రమంలో గత 24 గంటల్లో 22 మంది మరణించారు. ఈ ఘటన బీహార్లోని తొమ్మిది జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
నేడు (అక్టోబర్ 8న) భారత వైమానిక దళ దినోత్సవం. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా ఉనికిలోకి వచ్చిన ఈ దళం దేశంలో జరిగేే విపత్తులు, యుద్ధాలు, రక్షణ సేవల్లో కీలకమైన పాత్రను పోషిస్తూ సేవలందిస్తోంది. ఈ సందర్భంగా వీరి సేవలను ఈరోజు గుర్తు చేసుకుందాం.
ఘజియాబాద్లో బంధుత్వాలు తలదించుకునే ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక మేనమామ మొదట తన 7 ఏళ్ల మేనకోడలుపై అత్యాచారం చేశాడు. రహస్యాన్ని బయటపెడతుందనే భయంతో ఆమెను హత్య చేశాడు.
సిక్కింలో ఆకస్మిక వరదలు, రహదారి కనెక్టివిటీ కారణంగా మంగన్ జిల్లాలోని లాచెన్, లాచుంగ్లలో 3,000 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. అయినప్పటికీ అందరూ సురక్షితంగా ఉన్నారు.
చోటా రాజన్ ముఠా అంటే 1990లలో ముంబై వణికిపోయేది. ఆయన గ్యాంగ్ చేసే పనులకు పోలీసులు తలలు పట్టుకోవల్సిన పరిస్థితి. అలాంటి ముఠాలోని ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఈ రోజుకి పోలీసులకు చిక్కాడు.
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ(Delhi) కూడా ఒకటి. దేశ రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి తన కార్యాచరణ ప్రణాళికను ఈరోజు ప్రారంభించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా 300 కంటే ఎక్కువ AQI నమోదైంది. ఇది 'తీవ్రమైనది'గా అధికారులు వర్గీకరించారు.
తమిళనాడులోని దళిత రాజకీయ పార్టీ, డిఎంకె మిత్రపక్షమైన విడుతలై చిరుతిగల్ కట్చి (VCK), వివిధ వర్గాల రిజర్వేషన్ల పరిమాణాన్ని వారి జనాభాకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను ప్రారంభించాలని డిమాండ్ చేసింది.