నేవీ డే సందర్భంగా ప్రధాని మోడీ నేవీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'నేవీ డే 2023' వేడుకలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. డిసెంబర్ 4 ఈ చారిత్రాత్మక దినంగా పేర్కొన్నారు.
మణిపూర్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన హింసాత్మక ఘటనలో కనీసం 13 మంది మరణించారు. తెంగ్నౌపాల్ జిల్లాలోని సైబోల్ సమీపంలోని లెతితు గ్రామంలో మధ్యాహ్నం సమయంలో రెండు గ్రూపుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రతా బలగాల అధికారులు తెలిపారు.
2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శాతం మంది పురుషులే చనిపోతున్నట్లుగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
మిచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైతో సహా అనేక నగరాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఎటు చూసిన నీరే కనిపిస్తోంది.
సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాకు సోమవారం పెద్ద ఊరట లభించింది. అతని సస్పెన్షన్ రద్దు చేయబడింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవ్ చద్దా తెలిపారు.
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉన్న పార్టీ నేతను ఓ సాధారణ కూలీ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. అంతేకాదు ప్రజలు కూడా అతనికే పట్టం కట్టారు. అయితే అతను ఎవరు? ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా.. మిజోరం ఫలితాలు మాత్రం ఈరోజు వచ్చాయి. మిజోరం మేజిక్ ఫిగర్ కూడా దాటేసి ముందుకు దూసుకెళ్తుంది.
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
మిజోరాం రాష్ట్రంలో నవంబర్ 7న ఎన్నికలు జరుగగా..ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ 3న జరగాల్సిన పోలింగ్ ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థన మేరకు నేడు ఫలితాలను ప్రకటిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశవ్యాప్తంగా ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఎన్నికల అధికారిక వెబ్ సైట్ ను ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో అది క్రాష్ అయినట్లు పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇటివల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా..ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా గెలుపు అన్నట్లుగా ఆసక్తి ఉంది.
టాంజానియా దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఒకే విమానాశ్రయంలో ఒకే రోజు రెండు విమానాలు కూలిపోయాయి. అది కూడా గంటల్లోనే రన్వేవి తాకాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. రాజధానిలో ఏక్యూఐ 400 దాటింది. రాజధానిలో రోజు రోజుకు గాలి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
సాధారణంగా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు దేశంలోని ఉత్తర ప్రాంతాలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటాయి. అయితే ఈసారి వాతావరణం మారనుంది. డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు భారతదేశం అంతటా సాధారణం కంటే ఎక్కువ వేడి ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
దుబాయ్ పర్యటనలో ప్రధాని మోదీ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు కాలుష్య నివారణకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 7 ద్వైపాక్షిక సమావేశాల్లో పలు కీలక విషయాల గురించి చర్చించారు.