Tamil Nadu : కరెంట్ షాక్ తో విలవిలలాడిన గజరాజు మృతి
తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరికి అందరు చూస్తుండగానే ఏనుగు (elephant) విద్యుత్షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది..
స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు (Forest officials)ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారణాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించారు. ఏనుగు విద్యుత్షాక్తో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగు (elephant) ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలిందా? లేక విద్యుధాఘాతంతో చంపేందుకు ఎవరైనా ప్లాన్ చేశారా..? అన్న కోణంలో అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయితేగాని ఏనుగు మృతిపై క్లారిటీ వచ్చేలా లేదు.