షావోమీ అనుబంధ సంస్థ పోకో.. M8 5G పేరిట కొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15, 6.76 అంగుళాల డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, వెనక వైపు 50MP,+2MP, ముందు వైపు 20MP కెమెరా, 5,520mah బ్యాటరీ, 45W పాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 6GB+128GB వేరియంట్ ధరను రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది.