»Should Voting In Election Some Countries Fine For People
Vote: వేయకుంటే ఫైన్ విధిస్తారు తెలుసా?
మనదేశంలో జరిగే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటు(vote) హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి కాదు. కానీ అనేక దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోతే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అవి ఏంటి? ఎలా అమలు చేస్తున్నారనే విషయం ఇప్పుడు చుద్దాం.
భారతదేశంలో ప్రతి పౌరుడు వారి ఓటు(vote) హక్కు వినియోగించుకోవాలి. అది వారి సామాజిక బాధ్యత. కానీ తప్పనిసరి కాదు. కానీ పలు దేశాల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఏ దేశాల్లో అమలు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 దేశాలకుపైగా తమ పౌరులకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. వీటిలో బ్రెజిల్, టర్కీ, ఈజిప్ట్, లక్సెంబర్గ్, బెల్జియం, ఇటలీ, గ్రీస్, ఆస్ట్రేలియా ఉన్నాయి. వీటిలో చాలా దేశాలు లాటిన్ అమెరికాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే అక్కడి ప్రభుత్వం వారికి 20 డాలర్ల జరిమానా(fine) విధిస్తుంది. బ్రెజిల్లో కూడా ఓటు వేయని వారు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
టర్కీ(turkey)లో నిర్బంధ ఓటింగ్ 1986 చివరిలో ప్రవేశపెట్టబడింది. పౌరులు ఓటు వేయడానికి వెళ్లకపోతే, వారు ఎనిమిది యూరోల జరిమానా చెల్లించాలి. చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఓటింగ్ శాతం 86%కి పెరిగింది. అయినప్పటికీ తప్పనిసరి ఓటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. 1924 నుంచి ఆస్ట్రేలియా పౌరులకు ఓటు వేయడం తప్పనిసరి. ఒక ఆస్ట్రేలియన్ మొదటిసారి ఓటు వేయకపోతే 20 డాలర్ల జరిమానా చెల్లించాలి. ఎవరైనా క్రమం తప్పకుండా ఓటు వేయకపోతే, వారు జైలు శిక్షను కూడా అనుభవిస్తారు. ఆస్ట్రేలియన్లు నిర్బంధ ఓటింగ్ సానుకూలంగా భావిస్తారు. అందువల్ల 1960ల నుంచి ఓటింగ్ శాతం 92% కంటే తక్కువగా లేదు.
1893 నుంచి బెల్జియం తప్పనిసరి ఓటింగ్ చట్టాన్ని కలిగి ఉంది. ఓటరు ఎన్నికల్లో పాల్గొనలేకపోతే 50 యూరోల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఓటర్లు(voters) ఓటు వేయకుంటే ఓటర్ల జాబితా నుంచి తమ పేరును తొలగిస్తామని బెదిరిస్తున్నారు. లక్సెంబర్గ్లో నిర్బంధ ఓటింగ్ చట్టం ఉంది. అయితే 1964 నుంచి ఓటు వేయనివారు శిక్షించబడలేదు. అయినప్పటికీ ఓటింగ్ సగటున 95%తో ఇప్పటికీ ఎక్కువగానే కొనసాగుతుంది.