AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు దుర్గమ్మ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీచక్రార్చన, కుంకుమార్చనకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ మాలధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.