ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై పోలీసులకు అనేకసార్లు తెలిపినా కూడా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షల్లో నిందితులు ప్రశాంత్, నవీన్, మహేష్ ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు.
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు(Suresh Balu) ధనోర్కర్ కన్నుమూశారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ ఢిల్లీ ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతిని...
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బహిరంగంగా జరిగిన ఈ హత్య దారుణం మాత్రమే కాదు, మానవాళికే సిగ్గుచేటు. కోపంతో నేరం చేశానని నిందితుడు సాహిల్(sahil) తన నేరాన్ని అంగీకరించాడు. అయితే మైనర్ బాలికను చంపిన తర్వాత ఆమె మృతదేహం అరగంట పాటు అక్కడే పడి ఉంది.
జూబ్లీ హిల్స్లో Xora నైట్ క్లబ్లో వినూత్నంగా జంతువులను బంధించి పార్టీ జరుపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి వన్యప్రాణులను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అందించారు.
జమ్మూకశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడిపోయింది.
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
తిరుమల (Tirumala) క్షేత్రంలో తరచూ ప్రమాదాలు (Accidents) చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో రెండో సంఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో (Ghat Way) మూలమలుపు వద్ద టెంపో వాహనం (Tempo) బోల్తా పడింది. గోడను తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా, వాహనంలోని 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది. చదవండి: Congress Partyకి భారీ షాక్.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే జంప్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిర...
పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని వివరించింది. కాగా, ఆమె చేసిన పని అందరినీ కలచి వేసింది.
విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.