• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అటవీ ప్రాంతాల్లో అర్థరాత్రి తవ్వకాలు…!

MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

February 22, 2026 / 08:24 AM IST

‘మండల స్థాయిలో ప్రజావాణి పునః ప్రారంభం’

MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

February 22, 2026 / 08:23 AM IST

నేడు నారాయణ గూడెం మందకృష్ణ రాక..!

SRPT: మునగాల మండలం నారాయణ గూడెంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులపై దాడి చేసినా, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధ్యత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:21 AM IST

మెదక్ జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని వ్యాపారులు తెలిపారు.

February 22, 2026 / 08:18 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇవే..!

మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.206 నుంచి రూ.230 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.234 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.5 వరకు తగ్గింది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారస్థులు తెలిపారు.

February 22, 2026 / 08:15 AM IST

‘ప్రజలకు ఉచిత న్యాయ సహాయం’

PDPL: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యమని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేష్ తెలిపారు. నిన్న సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవగాహనతోనే న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:14 AM IST

తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించిన విద్యార్థులు

KNR: స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. హెచ్ఎం జలీల్, ఉపాధ్యాయులు కుమార్, పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అనిల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖాతాల రకాలు, డిపాజిట్లు, వడ్డీ రేట్లు, రుణాల ప్రక్రియ గురించి వివరించారు.

February 22, 2026 / 08:11 AM IST

జనగామలో నేడు చికెన్ ధరలు

జనగామ పట్టణంలో నేడు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.280–300, దేశీ కోడి కిలో రూ.350–380 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం కారణంగా ధరలు ఎగసినట్లు తెలిపారు. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు తగ్గింది, తద్వారా మార్కెట్‌లో రద్దీ తగ్గినట్లు కనిపిస్తోంది.

February 22, 2026 / 08:10 AM IST

‘నేడు గురుకుల సెట్ ఏర్పాట్లు పూర్తి’

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు నిర్వహించనున్న గిరిజన గురుకుల పాఠశాలల 5, 6, 7, 8, 9 తరగతుల 2026–27 విద్యా సం,లో ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గిరిజన గురుకులాల జాయింట్ సెక్రటరీ DS వెంకన్న తెలిపారు. RCO కార్యాలయంలో ప్రిన్సిపాల్లతో సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.

February 22, 2026 / 08:08 AM IST

రాజేంద్రనగర్‌లో యువకుడి దారుణ హత్య

RR: రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సమీపంలో దారుణ హత్య వెలుగుచూసింది. టోలి చౌకికి చెందిన అమీర్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

February 22, 2026 / 08:08 AM IST

కెనాల్ నిర్మాణం పూర్తి చేయాలంటూ వంట వార్పు

SRCL: కెనాల్ నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరుతూ రైతులు రోడ్డపై నిరసన చేపట్టారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ సమీపంలో ఎల్ఎమ్ 6కెనాల్ నిర్మాణం చేపట్టాలంటూ రైతులు చేపట్టిన నిరసనదీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పాటు వంటావార్పు చేపట్టారు.

February 22, 2026 / 08:07 AM IST

సీఎం కప్‌లో పరిగి తైక్వాండో క్రీడాకారుల ప్రతిభ

VKB: పరిగికు చెందిన ఫిట్‌నెస్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సాయి రామ్ (U45), ఆకాశ్ (U59), రజిత తమ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. కోచ్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో రాణించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.

February 22, 2026 / 08:06 AM IST

షబ్బీర్ అలీకి MLA కేవీఆర్ సవాల్..!

KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి MLA KVR సవాల్ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు వెళ్దామని, తాను తప్పు చేసినట్లు రుజువైతే షబ్బీర్ అలీ కాళ్లు మొక్కి, శాశ్వతంగా రాజకీయం సన్యాసం తీసుకుంటానని అన్నారు. తాను మాట మీద ఉంటానని తెలిపారు. కాంగ్రెసోళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆట మొదలు పెట్టారని, రేపటి నుంచి అసలు ఆట తాను చూపిస్తానని హెచ్చరించారు.

February 22, 2026 / 08:05 AM IST

అంతర్జాతీయ పోటీల్లో మద్దులపల్లి బాలుడికి స్వర్ణం

JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన దావు హార్తిక్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల బాలుర కాటాస్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాడు.

February 22, 2026 / 08:03 AM IST

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ

MDK: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వార్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్‌కు సంబంధించి నేతలకు, కార్యకర్తలకు తగు సూచనలను చేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నర్సాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, శ్రీకాంత్ నిరంజన్ దాస్‌ను సన్మానించారు.

February 22, 2026 / 08:03 AM IST