NZB: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి క్రమం తప్పకుండా డిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడం వల్లే ఆయన సీఎం పోస్టింగ్ ఉందని, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్ అయి ఉండేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏఐసీసీకి ఏటీఎంగా మార్చారని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
NLG: కోదాడ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని (TS 29 T 3458) చిట్యాల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 9 ఆవులను కబేళాకు తరలిస్తున్న డ్రైవర్ షేక్ జానీ పాషా, యజమాని వేముల అనిల్ కుమార్లపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించారు.
SRCL: ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్దం చేశారు. పరీక్ష సమయానికంటే విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లోకి నిమిషం ఆలస్యమైన కేంద్రంలోనికి ప్రవేశం ఉందన్నారు.
PDPL: హైదరాబాద్లో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన సీఎం కప్’వుషు’,కిక్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో శ్రావ్యంజలి, సిరి చందన, అనన్య, శ్రావ్య, రాజ్కుమార్ పతకాలు సాధించారు. విజేతలను జిల్లా జనరల్ సెక్రటరీ కుమార్, కోచ్ రాజుమార్ తదితరులు అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
MDCL: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది కాంగ్రెస్లో చేరుతున్నారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం HMT నగర్ డివిజన్ పరిధిలో సామాజిక కార్యకర్త భావన గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
MHBD: నాగర్ కర్నూల్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారకులైన అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమని మండిపడ్డారు.
ADB: గంజాయి కేసులో ఇద్దరు నిందితులు జాధవ్ సాయినాథ్, బనియా గోవింద్ అరెస్ట్ చేసినట్లు CI గురుస్వామి సోమవారం తెలియజేశారు. ఈ మేరకు నిందితులపై బోథ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
KMM: హైదరాబాద్లోని మొయినాబాద్ ఐఐటీఏ (IITA) శిక్షణ కేంద్రంలో 8 నెలల పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న పింకీ (Pinky), రోక్సీ (Roxy) అనే రెండు పోలీస్ జాగిలాలు విధుల్లో చేరాయి. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. నేరాల పరిశోధన, పేలుడు పదార్థాల గుర్తింపు, నిందితుల వేటలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
MBNR: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నవాబుపేటలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
BDK: హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం సహాయనిధి విభాగాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం సందర్శించారు. అశ్వారావుపేట పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లులను ఆర్థిక సహాయం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.
KNR: సైబరాబాద్లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.
SRPT: జిల్లాలో ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సులు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రశ్నపత్రాల తరలింపులో పటిష్ట భద్రత పాటించాలని అన్నారు.
NZB: నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మాను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన ఘట్టం ఎదుర్కోళ్ల మహోత్సవం ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మోహిని అలంకార సేవతో వేదపారాయణం ప్రారంభమవుతుంది. రాత్రి 8గంటలకు అశ్వ వాహన సేవ, 8:45 ఎదుర్కోళ్ళు మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం పొందాలని ఆలయ ఈవో కోరారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దెబ్బతిన్న స్థితిలో కనిపిస్తోంది. విగ్రహం చేయి విరిగిపోయి ఉన్న నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైనది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వందలాది మంది రాకపోకలు సాగించే ముఖ్య కూడలిలో ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాన్ని మరమ్మతు చేయాలన్నారు.