HYDలో ఉష్ణోగ్రతల 33 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్న వేళ విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి పరిధిలో 965, మేడ్చల్ 626, హైదరాబాద్ మెట్రో జోన్ ప్రాంతాల్లో 297 DTRలు ఏర్పాటు చేస్తున్నట్లుగా డిస్కం అధికారులు తెలిపారు. HYDలో 3500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ రికార్డు అవుతుంది.
GDWL: గుండెపోటుతో ఇంటి యజమానిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబానికి ఈ ఐదు లక్షల ఆర్థిక సాయం భవిష్యత్తుపై భరోసానిస్తుంది అని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ అన్నారు. గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామానికి శారదమ్మకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ సొమ్మును వృథా చేయకుండా పిల్లల చదువులకు వాడాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)కు ఎంపికైనట్లు ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. ఇది పాఠశాలలో అమలు చేస్తున్న సమర్థవంతమైన బోధన విధానాలకు నిదర్శనమని మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.
సూర్యాపేట జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే పారదర్శకంగా యూరియా బుక్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేని వారు వాలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. అనవసరంగా నిల్వ చేయవద్దని, అవసరమైనప్పుడే కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.
NZB: పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల అనుమతి లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
KMR: డోంగ్లి నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారిని రమ్య సూచించారు. డోంగ్లిలోని నర్సరీను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో గాయపడిన మహిళా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NGKL: వాహన డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని మరికల్ సీఐ భగవంతు రెడ్డి వాహనదారులకు సూచించారు. అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వేగంతో వాహనాలు నడపరాదన్నారు.
NRPT: జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
JGL: ధర్మపురిలో ఇస్కాన్ ప్రతినిధుల బృందం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసింది. నరహరి ప్రభు ఆధ్వర్యంలో వచ్చిన బృందం ధర్మపురిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది. కృష్ణ భక్తి ప్రచారం, భగవద్గీత శిక్షణ, నిత్య అన్నదానం, గోశాల నిర్వహణ ప్రధాన లక్ష్యాలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమానంద్, సురనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
SRD: రామచంద్రపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిప్యూటీ ఆరోగ్య అధికారి ఏఎస్డీ కమల కుమారి బృందం ఆధ్వర్యంలో లేక్ వ్యూ రెసిడెన్షియల్ కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 30 సంవత్సరాల పైబడిన వారి ఆరోగ్య వివరాలను సేకరించినట్లు కమల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డిని కలిసి ఆరోగ్య సంబంధిత వివరాలు తీసుకున్నారు.
KMR: తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, జొన్న నేలకొరిగింది. దీంతో రైతులు పంట నష్టం జరిగిందని మంగళవారం వాపోయారు. పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన పంటకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
RR: కోహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల పాలకవర్గం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం నిలిచిందన్నారు.
RR: కుమ్మెర జాతరలో అగ్రవర్ణాల దాడికి బలైపోయిన చిన్నారి మృతికి నిరసనగా BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో SDNR పట్టణానికి చెందిన జాతీయ BC జనసేన అధ్యక్షులు చంద్రశేఖరప్ప, నియోజకవర్గ అధ్యక్షురాలు జలజ, తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ కుల దురహంకారం నశించాలని, చిన్నారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని కోరారు.