• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMR: పిట్లం మండల కేంద్రం లో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

February 23, 2026 / 05:49 PM IST

‘న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలి’

RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.

February 23, 2026 / 05:48 PM IST

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: శేఖర్ రెడ్డి

NLG: కొండమల్లేపల్లిలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలన్నారు.

February 23, 2026 / 05:47 PM IST

‘పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు’

ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.

February 23, 2026 / 05:47 PM IST

కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

MBNR: హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగయ్య పల్లికి చెందిన హనుమంతు నాయక్ (70) తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేయి విరిగింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 05:45 PM IST

ప్రజావాణిలో సమస్యలపై అర్జీలు

MDCL: అల్వాల్ సర్కిల్ ప్రజావాణిలో బీజేపీ నాయకులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. రోడ్లపై చిన్నచితకా వ్యాపారాల వల్ల బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని డీసీ భోగేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటాపురం కొత్తబస్తీ అంబేద్కర్ భవన్‌ను నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉంచాలని, భవనంలో విద్యుత్, నీటి సమస్యలు, బోర్‌వెల్‌ను మరమ్మతు చేయాలని బస్తీవాసులు కోరారు.

February 23, 2026 / 05:41 PM IST

క్రీడల్లో సూర్యాపేట పోలీసుల సత్తా

SRPT: రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారు. పరుగులో ఆర్‌ఎస్సై మహేష్, జావెలిన్ త్రోలో స్వామి బంగారు పతకాలు సాధించగా, పలువురు మహిళా కానిస్టేబుళ్లు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సోమవారం విజేతలను ఎస్పీ కె.నరసింహ అభినందించారు. క్రీడల్లో రాణిస్తే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 05:40 PM IST

పదో వార్డ్ సమస్యపై స్పందించిన ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు వివేకానంద కాలనీలోని కాల్వలో మట్టి కూడుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మున్సిపల్ అధికారులకు తెలుపగా, స్పందించలేదని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి JBC సహాయంతో కాలువ మరమ్మతు పనులు చేయించినట్లు కౌన్సిలర్ తెలిపారు.

February 23, 2026 / 05:39 PM IST

నర్వలో విద్యా కాంప్లెక్స్ సమావేశం

NRPT: నర్వ మండల కేంద్రంలో సోమవారం విద్యా కాంప్లెక్స్ సమావేశం జరిగింది. విద్యార్థుల అభ్యాస పురోగతి, హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈవో రాంరెడ్డి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రాథమిక విద్యా నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

February 23, 2026 / 05:39 PM IST

జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16, 2026 వరకు SSC పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 05:38 PM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో కలిసి ముచ్చటించారు.

February 23, 2026 / 05:38 PM IST

రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: డిప్యూటీ సీఎం

VKB: దేశ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వికారాబాద్ అనంతగిరిలో తెలుగు ఉభయ రాష్ట్రాల DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రోహిత్ వేముల ఘటనలో రాహుల్ స్పందించిన తీరు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనమని చెప్పారు.

February 23, 2026 / 05:37 PM IST

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

BDK: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

February 23, 2026 / 05:37 PM IST

రాజాపేటలో యూరియా కోసం రైతుల‌ నిరసన

BHNG: రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్‌లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు.

February 23, 2026 / 05:34 PM IST

లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

NZB: విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్య తాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.

February 23, 2026 / 05:34 PM IST