• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

NZB: కమ్మర్పల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. హస కొత్తూరు 3, చౌటుపల్లి 2, బషీరాబాద్ 2, కొనసముందర్ 2, కోనాపూర్ 2 చెక్కులను ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో జీ . ప్రసాద్, ఆస్ఐ శరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నలిమెల రేవతి గంగాధర్, మహబూబ్, బైకని జమున మహేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:00 PM IST

భట్టి కుమారుని పెళ్లి పనులను పరిశీలించిన కేఎల్ఆర్

RR: రేపు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య పెళ్లి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పనులను పరిశీలించారు. వీఐపీలు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

March 4, 2026 / 06:58 PM IST

‘ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి’

WNP: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు మహానంది, ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ను విడుదల చేశారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

March 4, 2026 / 06:57 PM IST

ఎల్బీనగర్‌కు చేరుకున్న బౌద్ధ బైక్షువుల పాదయాత్ర

RR: ప్రపంచ శాంతి కోసం కర్ణాటక నుంచి బౌద్ధ బైక్షువులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి శాంతి మార్గంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని తెలిపారు.

March 4, 2026 / 06:53 PM IST

వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలి: కలెక్టర్

SDPT: కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్ల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

March 4, 2026 / 06:50 PM IST

పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌

MDK: రామాయంపేట పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా బీ.శ్రావణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన ఆయనకు మున్సిపల్ కమిషనర్‌గా ఇది మొదటి పోస్టింగ్ కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో అందజేస్తాన్నన్నారు

March 4, 2026 / 06:50 PM IST

‘చేయూత’ పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన నేతలు

WGL: నెక్కొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఇందిరాగాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చేయూత’ పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు గత సర్పంచ్ ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. సర్పంచ్ హరిప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

March 4, 2026 / 06:48 PM IST

చింతకానిలో ఘోర ప్రమాదం.. మైనర్ డ్రైవర్ మృతి

KMM: చింతకాని మండలం నాగులవంచ సమీపంలో మార్చి 1న జరిగిన రెండు ట్రాక్టర్ల ప్రమాదంలో ఓ యువ డ్రైవర్ దుర్మరణం చెందారు. మృతుడి వయస్సు ఆధార్ ప్రకారం 19 ఏళ్లని తల్లి పేర్కొన్నప్పటికీ, SSC మెమో ఆధారంగా అతను 16 ఏళ్ల మైనర్ అని పోలీసుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనాన్ని అప్పగించినందుకు గానూ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 06:45 PM IST

మంత్రిని కలిసిన మున్సిపల్ ఛైర్మన్

NRML: పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ కావ్య, వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తిలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లికి విన్నవించారు. బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ అభివృద్ధితో పాటు శ్యామఘడ్, బత్తిస్ ఘడ్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

March 4, 2026 / 06:45 PM IST

జిల్లాలో ముగిసిన LLB పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో LLB 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా 108 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:40 PM IST

ప్రమాదబీమా పథకం కింద 231 క్లెయిమ్స్ పరిష్కారం: మంత్రి

MLG: ప్రమాదబీమా పథకం కింద ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించి, మొత్తం రూ.23.1 కోట్లు లబ్దిదారుల కుటుంబాలకు అందించినట్టు మంత్రి చెప్పారు. ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం పెద్ద ఊరటనిస్తుందన్నారు.

March 4, 2026 / 06:40 PM IST

మంత్రి సీతక్కను కలిసిన గద్వాల ఎమ్మెల్యే

GDWL: తన కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బుధవారం మంత్రి సీతక్కను, ఎంపీ మల్లు రవిని ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మార్చి 14న గద్వాలలో జరిగే ఈ వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

March 4, 2026 / 06:38 PM IST

ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌కు 98% హాజరు

HNK: నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

March 4, 2026 / 06:37 PM IST

భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:35 PM IST

విద్యార్థులకు ‘PMEGP’పై అవగాహన కార్యక్రమం

NLG: ఎంజీయూ (MGU) కామర్స్ విద్యార్థులకు ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం’ (PMEGP)పై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పథక ఉద్దేశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, దరఖాస్తు ప్రక్రియపై నిపుణులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డైరెక్టర్ డా. సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:33 PM IST