GDWL: నిరంతరం విధి నిర్వహణలో ఉంటూనే, క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపి గద్వాల్ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం గర్వకారణం అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో గద్వాల పోలీసులు 4 స్వర్ణ, 8 కాంస్య పతకాలతో సత్తా చాటారు. మంగళవారం విజేతలను ఎస్పీ అభినందించారు.
NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని దోమల నివారణకై దోమల మందు పిచికారి చేయాలని యువకులు మంగళవారం గ్రామ సర్పంచ్ మొగులప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు. దోమలతో పాటు పందుల బాధలు నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, రాజు, రాము, చెన్నకేశవులు, ఆంజనేయులు ఇచ్చిన వారిలో ఉన్నారు.
VKB: దోమ మండలంలోని బడేంపల్లిలో తాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గడ్డం శంకర్ వెంటనే స్పందించి నూతన మోటార్ అమర్చే పనులను చేపట్టించారు. తక్షణ చర్యలతో మోటార్ను బిగించి గ్రామస్థులకు తిరిగి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. సర్పంచ్ వేగవంతమైన చర్యలకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ను మంగళవారం రాంనగర్ గ్రామస్థులు మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ASF: రెబ్బెన మండలం గోలేటిలో గతంలో జరిగిన RTC బస్ ఆక్సిడెంట్లో RTC డ్రైవర్ రామారావుకు సంబంధం లేకున్న బాధ్యులుగా చూపించి రిమాండ్కు పంపించారని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రామారావుపై పెట్టిన కేసు ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ జ్ఞాపకార్థం ముత్యం మల్లయ్య, ముత్యం ప్రశాంత్ గౌడ్ కెమెరాలు అందజేశారు. సర్పంచ్ ఎం. రాజు, ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రారంభించారు. గ్రామస్తులు దాత కుటుంబాన్ని అభినందించారు.
MNCL: లక్షెట్టీపేట మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న ప్రభుత్వ నర్సరీని స్థానిక ఎంపీడీవో సరోజ సందర్శించారు. మంగళవారం ఆమె తిమ్మాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తప్పులు రాకుండా చూడాలన్నారు. నర్సరీని సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు.
GDWL: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
KMR: బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం పిట్లంలో ఆయన మాట్లాడూతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA లక్ష్మీకాంతరావు కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయన్నారు.
SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.
RR: ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోని నోముల గ్రామంలో భార్యని భర్త హత మార్చాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నోములకి చెందిన మధర్మోని బాబు తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన పనస గోవింద్, రెండు రోజుల క్రితం హుజూర్నగర్ వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్లో కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోయిన ఆయన ఇవాళ మేళ్లచెరువు మండలం జోగుకుంట వద్ద గోవింద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMM: ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ తీవ్రంగా ఖండిచారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్బాలు పలికే కాంగ్రెస్ నేతలు పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్లో నమోదు చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.