JGL: కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై అరైవ్ ఆలైవ్లో భాగంగా బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి బ్రెత్ అనలైజర్తో పరీక్షలు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు.
PDPL: సురక్షిత ప్రయాణం, ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీ చౌక్,కార్ టాక్సీ అడ్డా వివిధ ప్రాంతాలలో బుధవారం భారీ వాహనదారుల సీటు బెల్టు తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.
నల్లగొండ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ / డిప్లొమా అభ్యర్థులు NATS వెబ్సైట్ https://nats.education.gov.in ను మార్చి 5 వరకు సందర్శించి నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 75691 18549 సంప్రదించాలన్నారు.
SDPT: బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు.
WGL: ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల & కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇవాళ DSFI ఆధ్వర్యంలో గురుకులాల సెక్రటరీ సీత లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర( P) శివ వర్మ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మెనూని అందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
HYD: రేణుక నగర్కు చెందిన సత్యనారాయణ పక్షవాతం, గుండెపోటుతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు షైక్ ఫరీద్, వినీత్ కుమార్ ఆయన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ గుప్త, ఉమేష్ పాల్గొన్నారు.
JN: రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరి శక్తి డైరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కూలింగ్ ఛాంబర్లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోవడంతో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: పానగల్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఔత్సాహిక పాల్ సమీక వేతలకు విశ్వకర్మ, పీఎం ఈజిపి స్కీంలపై అవగాహన కల్పించారు. జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చేతివృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMR: ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర (సెట్ “బీ”) తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246 మందికి 243 మంది, ఆదర్శ కళాశాల కేంద్రంలో 219 మందికి 208 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
PDPL: పెద్దపల్లి మదర్ థెరిసా కాలేజీలో నిర్వహించిన 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్లకు ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీవో షబ్బీర్ చేతుల మీదుగా మంథని(M) గుంజపడుగుకి చెందిన దండవేన సంధ్యకి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై శిక్షణ పొందిన సర్పంచ్లకి అధికారులు అభినందనలు తెలిపారు.
ADB: మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బెల్లూరు కాలనీలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోకో పిట్ యూనిట్ను మున్సిపల్ ఛైర్పర్సన్ అనూషతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ రాజు తదితరులు ఉన్నారు.
NRML: ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడతూ.. అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాప్లు నిర్వహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.
KMM: ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో పోలీసులు బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పదేళ్ల బాలుడిని ఎస్సై హరిత చేరదీసి విచారించారు. తన పేరు కట్టా పెనుకొండయ్య, జగ్గయ్య పేట అని చెప్పాడు. మిగతా వివరాలు కూడా ఎస్ఐ హరిత తెలుసుకున్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తల్లి బిడ్డను కలిపారు. దీంతో పలువురు ఆమెని ప్రశంసించారు.
SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో బుధవారం హైదరాబాద్ బాచుపల్లి మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత విద్య శిబిరం నిర్వహించారు. బీపీ షుగర్ తన అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత శిబిరంలో 90 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.