ADB: గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్ ఖాన్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కేంద్రంలో రికార్డులను తనిఖీ చేసిన ఆయన పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, విద్యా బోధన తీరును పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చూడాలని, శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.
MBNR: సీఎం రేవంత్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా సీఎం హర్షం వ్యక్తంచేస్తూ అభినందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
SRD: రాయికోడ్ మండలం ఔరంగ నగర్ లో బొంగుండేశ్వర విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు విట్టల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. తన అద్భుత శక్తులతో మానవుల సమస్యలను పరిష్కరించి, గొప్ప వ్యక్తిగా మారిన వారిలో బొంగుండేశ్వర స్వామి ఒకరని కొనియాడారు.
NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను శనివారం పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.
SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి. సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్లో జరుగనున్నాయి. దీంతో అతన్ని పలువురు అభినందించారు.
ASF: మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారి, RDO జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి విప్ ధిక్కరణ నిజమని తేల్చారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్కు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. కౌన్సిలర్ బండ్లగూడ ప్రశాంత్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
NRML: ప్రజలు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కడెం ఎస్సై సాయికిరణ్ సూచించారు. కడెం మండలంలోని అంబర్పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో అపరిచితుల గురించి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
RR: శేరిలింగం పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలములు) విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నర్నె శ్రీనివాస్ రావు అందచేశారు.
NZB: బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆధ్వర్యంలో 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, 29వ వార్డు కౌన్సిలర్ రాజులదేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ గుంత అబ్బవ్వ గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
NZB: బోధన్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ మాణిక్ బండార్కు చెందిన రాజ్ కుమార్ కాలినడకన వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, జిల్లా ఆస్పత్రికి తరలించారు.
NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
SDPT: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 28 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.