ADB: ఉట్నూర్ మండలం షాంపూర్లో అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైతే వారిని రిమ్స్కు తరలించాలన్నారు.
NLG: ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గుండ్లపల్లి(డిండి) మండలం దాసరినెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.
SRPT: సూర్యాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం రోగులను అయోమయానికి గురిచేస్తోంది. రాజీవ్ నగర్ యూపీహెచ్సీ పునర్విభజనలో 23వ వార్డులోకి మారినా, బోర్డుపై మాత్రం పాత ‘21వ వార్డు’ నంబరే ఉండటం గమనార్హం. చిరునామా తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వార్డు నంబర్తో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
MDK: రామాయంపేట బైపాస్ రోడ్డు భూనిర్వాసితులు సోమవారం ఎంపీ రఘునందన్ రావును ఆయన నివాసంలో కలిశారు. మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులు కేటాయించడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. మార్కెట్ ధరతో సమానంగా తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
VKB: వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం అనన్య వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తెల్లవారుజామున పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన క్రీడలలో జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం ఉపేక్షించేది లేదని పట్టణంలోని అన్ని ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు చేశారు.
BDK: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
HYD: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. లేన్ క్రమశిక్షణ పాటించాలని కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇవాళ ఆయన కుటుంబానికి 2018 డిగ్రీ బ్యాచ్ స్నేహితులు చేయూతనందించారు. మానవత్వాన్ని చాటుతూ రూ.30 వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్నేహితుల మద్దతు ఎంతో బలాన్నిస్తుందన్నారు.
SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని BJP నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గంలో అరెస్టైన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, మేయర్, ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. ఇక కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మిగలగా, ఆశావహులు MLA ల ఆశీర్వాదం కోసం వేచిచూస్తున్నారు.
PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: అశ్వాపురం మండలం, భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించగా, సుమారు రూ. 80 కోట్లతో NBCC నిర్మాణం చేపట్టనుంది. ఈ విద్యాలయం ద్వారా జిల్లా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం 54 మంది లబ్ధిదారులకు రూ.24.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.