• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

3D పెండింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

JGL: జగిత్యాల-కరీంనగర్ రోడ్డులోని నర్సింగాపూర్‌లో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లో 3D ప్రింటింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. PMKVY 4.0 స్కీమ్‌లో భాగంగా సోమవారం నుంచి కోర్సు ప్రారంభమవుతుందని, ఈ కోర్సు 3 నెలలపాటు ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 06:38 AM IST

డిప్యూటీ సీఎంకు రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్

KMM: ఖమ్మంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి లభించింది. ఈ నిర్మాణానికి రూ.4.50 కోట్ల నిధులను పబ్లిక్ వర్క్స్- ఆఫీస్ బిల్డింగ్స్ ఖాతా నుంచి విడుదల చేశారు. ఈ మేరకు ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

February 21, 2026 / 06:38 AM IST

కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

SRPT: కోదాడ పట్టణంలో కుటుంబ సమస్యలతో కుక్కల కృష్ణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలో గణేష్ నగర్‌లో తన అద్దె నివాసంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్ వెల్లడించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 06:37 AM IST

రాష్ట్ర వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా డిచ్‌పల్లి విద్యార్థి

NZB: డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల (బాలుర) పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గోవింద్ సింగ్ జాతీయ స్థాయిలో జరుగనున్న సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్స్ దివ్యరాణి, లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్వాతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

February 21, 2026 / 06:31 AM IST

‘వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?’

NZB: జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. కాగా, జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్-మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి-సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి-విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దన్-ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్నరు.

February 21, 2026 / 06:27 AM IST

‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి’

WNP: త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిందస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి అదనపు కలెక్టర్ కీమ్యా నాయకు వినతిపత్రం అందజేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే స్థానిక సంస్థల్లో సముచిత రిజర్వేషన్లు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 06:26 AM IST

మహిళా విద్యతోనే నవసమాజ నిర్మాణం: ఎమ్మెల్యే

GDWL: మహిళా విద్య, రాజ్యాంగ అవగాహనతోనే ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలో జన విజ్ఞాన వేదిక (JUU) ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆడపిల్లల చదువు ఆవశ్యకత’ పోస్టర్, ‘బాలల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

February 21, 2026 / 06:26 AM IST

గోదావరిలో దూకి ఆత్మహత్య.. మహిళ వివరాలు లభ్యం

NZB: నవీపేట్ మండలం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ వివరాలను నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కాక్టైలి గ్రామానికి చెందిన అనసూయా దిలీప్ మోతెవాడ (23)గా నిర్ధారించారు. ఆమె దిలీప్ మోతెవాడ భార్యగా గుర్తించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

February 21, 2026 / 06:26 AM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయో కలెక్టర్ స్నేహ శబరీష్ అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించగా.. మార్క్ అవుట్ అయినవి ఎన్ని, ఇండ్లు మంజూరై ఇంకా పనులు మొదలు కాని వాటి వివరాలు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు కలెక్టర్‌కు వివరించారు. పనుల ఆలస్యానికి కారణాలను తెలుసుకున్నారు.

February 21, 2026 / 06:25 AM IST

‘ఈనెల 22న “థింకింగ్ డే” నిర్వహించాలి’

ADB: స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు ‘బెడెన్ పావెల్’ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమీషనర్, ఏసీఎల్.బీ ఎస్. రాజేశ్వర్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 06:23 AM IST

అక్రమంగా ఇసుక రవణా.. ట్రాక్టర్ల సీజ్

KNR: కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణరావుపల్లికి చెందిన కన్నం రమేష్, దుర్షేడ్‌కు చెందిన చేను రాజులను అరెస్టు చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు. నిందితులను తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి రూ. లక్షకు బైండోవర్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 21, 2026 / 06:22 AM IST

జాతీయ స్థాయికి వాలీబాల్ ప్లేయర్ తలకొండపల్లి వాసి

RR: తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సబ్ జూనియర్ U16 వాలీబాల్ గేమ్స్‌లో జాతీయస్థాయికి సెలెక్ట్ అయినట్లు పీడీ పాండు తెలిపారు. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ క్యాంపులో అజయ్ పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 23 నుంచి కలకత్తాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 06:19 AM IST

రోడ్డు ప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు

NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 21, 2026 / 06:19 AM IST

కార్మికుడు అనుమానస్పద మృతి

MDK: తూప్రాన్ పట్టణంలో APకి చెందిన మధుసూదన్ (32) శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చేగుంట మండలంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అతను తూప్రాన్ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. నిన్న కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వాళ్లకు ఫోన్ చేశారు. రాత్రి అద్దె గది కిటికీలోంచి చూడగా మృతి చెంది ఉన్నట్లు గమనించారు. ఈ ఘటణపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

February 21, 2026 / 06:17 AM IST

జాతీయ మానవ హక్కుల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరించిన సీపీ

PDPL: జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రతినిధులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల, కార్మికుల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా చూసుకుంటామన్నారు. ప్రతినిధులు ఎజ్జ రాజయ్య, సభ్యులు పాల్గొన్నారు.

February 21, 2026 / 06:17 AM IST