• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కూసుమంచిలో 1460 బస్తాల యూరియా సిద్ధం

KMM: కూసుమంచి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో, సొసైటీలలో సోమవారం 1460 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఏవో అధికారిణి రామడుగు వాణి తెలిపారు. చేగొమ్మ సొసైటీలో 445, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 270 బస్తాలు, అన్నదాత పర్టిలైజర్‌లో 270, మనగ్రోమోర్‌లో 445 బస్తాలు, మొత్తం 1430 యూరియా బస్తాలు ఉన్నాయన్నారు.

February 23, 2026 / 01:35 PM IST

ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

February 23, 2026 / 01:30 PM IST

వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం

KNR: చొప్పదండి ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. ఈనెల 23 నుంచి 27 వరకు ఆర్నకొండ, భూపాలపట్నం, చాకుంట, దేశాయిపేట, పెద్ద కురువపల్లి, మంగళపల్లి, రాగంపేట, రేవెల్లి, మార్చి 2 నుంచి మార్చి 7 వరకు చిట్యాలపెళ్లి, గుమలాపూర్, కాట్నపల్లి, కొలిమికుంట, రుక్మాపూర్ వారికి శిక్షణ ఉంటుందన్నారు

February 23, 2026 / 01:30 PM IST

సర్పంచుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం నూతన సర్పంచుల సంఘం కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ కృష్ణ నాయక్, అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షులు వెంకటరం, మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో పలువురు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.

February 23, 2026 / 01:30 PM IST

‘ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుంది’

MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.

February 23, 2026 / 01:30 PM IST

మంచి వైద్య సేవలు అందించాలి: MLA

MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు డాక్టర్లు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.

February 23, 2026 / 01:30 PM IST

పట్టాలు ఎప్పుడు ఇస్తారు…?

NRML: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థ దశకు చేరుతున్న అధికారులు స్పందించడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 01:28 PM IST

తాండూర్ పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే

VKB: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నమోదైన కేసులో భాగంగా హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ఏడు మంది అనుచరులతో పాటు తాండూర్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈమేరకు పట్టణ సీఐ ముందు షూరిటీలు సమర్పించిన సమయంలో పైలెట్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హల్‌చల్ చేశారు.

February 23, 2026 / 01:28 PM IST

VIDEO: రజకులపై దాడిని నిరసిస్తూ ములుగులో రాస్తారోకో

SDPT: కుమ్మేర మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు.

February 23, 2026 / 01:27 PM IST

అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం

WNP: వనపర్తి పట్టణ పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో చెత్తాచెదారం, మురుగు నీరు పేరుకుపోవడంతో పందుల సంచారం, దోమల బెడద ఎక్కువైందని పట్టణ ప్రజలు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

February 23, 2026 / 01:26 PM IST

ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

NZB: విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అదేవిధంగా సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్​కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్​గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా సోమవారం అందించారు.

February 23, 2026 / 01:24 PM IST

ఈఎన్టీ సర్జన్‌కు అబ్దుల్‌ కలాం ఎక్సలెన్స్‌ అవార్డు

హైదరాబాద్ హెచ్‌ఐటీఎక్స్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ లవణం కళ్యాణ్ వరప్రసాద్‌ అవార్డు అందుకున్నారు. యాక్ట్‌ నౌ వాలంటరీ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ కే.ఎస్ మూర్తి చేతుల మీదుగా డాక్టర్ ఒటో- లారిన్జాలజీ హెల్త్‌కేర్‌‌లో ఉత్తమమైన సేవలను అందించినందుకుగాను ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు లభించింది.

February 23, 2026 / 01:24 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

NRPT: మరికల్ మండల కేంద్రం మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు పెంట మీద నారాయణ కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరమర్శించారు. నారాయణ మృతి కాంగ్రెస్ పార్టీకి, మత్స్య సహకార సంఘానికి తీరని లోటు అన్నారు. నారాయణ సేవలను కొనియాడారు. సర్పంచ్ చెన్నయ్య, పాలమూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సూర్య మోహన్ రెడ్డి ఉన్నారు.

February 23, 2026 / 01:24 PM IST

బోర్డ్ సరే.. క్రీడా ప్రదేశమేది..?

MDK: అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంటతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రోడ్డుకు ఆనుకొని క్రీడా ప్రాంగణం అనే పేరు గల బోర్డును తగిలించారు. ఓ వ్యవసాయ చేనులో ఏర్పాటు చేయడంతో ఆ రైతు చేను దున్నుకోవడం వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావలన్నారు.

February 23, 2026 / 01:24 PM IST

కొంపల్లిలో సైబరబాద్ మున్సిపల్ కమిషనర్ పర్యటన

HYD: కొంపల్లి సర్కిల్-56లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరుగుతున్నట్లు గుర్తించి, ఇకపై ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఏటీ వాహనాలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు పునరావృతమైతే జరిమానా విధించాలన్నారు.

February 23, 2026 / 01:22 PM IST