SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ కు వచ్చే మహిళ రైతులకు ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
MDCL: కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం యాంకర్ కనకాల సుమ రాజీవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ పూజారులు రవి శర్మ, రమేశ శర్మ, ప్రణీత్ శర్మ ఆశీర్వదించి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కుమారుడు తటాకం అభిలాష్ శర్మ ఉన్నారు.
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ కళాశాల భూముల అంశంపై రెఫరెండం సమర్పించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదిక విడుదల చేయాలని కలెక్టర్ను ఆయన కోరారు.
MDK: టైర్ల నుంచి ఆయిల్, పౌడర్ తయారు చేసే పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దని కోరుతూ చిన్న శంకరంపేట (M) కామారం గ్రామస్థులు అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ సుజాత సుధాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామ శివారులో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
BHNG: కన్నతల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లు తనను అనాథను చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వయసు మళ్ళిన కాలంలో అండగా ఉండాల్సిన వారే గడప దాటించడంతో, 81 ఏళ్ల వృద్ధురాలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆమె జిల్లా కలెక్టర్ హనుమంతరావును కలిసి గోడు వెల్లబోసుకుంది.
KMM: కూసుమంచి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో, సొసైటీలలో సోమవారం 1460 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని ఏవో అధికారిణి రామడుగు వాణి తెలిపారు. చేగొమ్మ సొసైటీలో 445, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 270 బస్తాలు, అన్నదాత పర్టిలైజర్లో 270, మనగ్రోమోర్లో 445 బస్తాలు, మొత్తం 1430 యూరియా బస్తాలు ఉన్నాయన్నారు.
KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
KNR: చొప్పదండి ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. ఈనెల 23 నుంచి 27 వరకు ఆర్నకొండ, భూపాలపట్నం, చాకుంట, దేశాయిపేట, పెద్ద కురువపల్లి, మంగళపల్లి, రాగంపేట, రేవెల్లి, మార్చి 2 నుంచి మార్చి 7 వరకు చిట్యాలపెళ్లి, గుమలాపూర్, కాట్నపల్లి, కొలిమికుంట, రుక్మాపూర్ వారికి శిక్షణ ఉంటుందన్నారు
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం నూతన సర్పంచుల సంఘం కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ కృష్ణ నాయక్, అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షులు వెంకటరం, మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో పలువురు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.
MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు డాక్టర్లు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.
NRML: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థ దశకు చేరుతున్న అధికారులు స్పందించడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు.
VKB: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నమోదైన కేసులో భాగంగా హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ఏడు మంది అనుచరులతో పాటు తాండూర్ పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లారు. ఈమేరకు పట్టణ సీఐ ముందు షూరిటీలు సమర్పించిన సమయంలో పైలెట్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు.
SDPT: కుమ్మేర మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు.
WNP: వనపర్తి పట్టణ పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో చెత్తాచెదారం, మురుగు నీరు పేరుకుపోవడంతో పందుల సంచారం, దోమల బెడద ఎక్కువైందని పట్టణ ప్రజలు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.