• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో నేటి చికెన్ ధరలు

పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230 నుంచి రూ.260, స్కిన్‌తో రూ.220 నుంచి రూ. 240 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి రూ.115. మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వరకు ఉంది. 100 కోడి గుడ్లు రూ. 530కి విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

February 22, 2026 / 08:49 AM IST

మర్చిపోయిన ఆభరణాల బ్యాగును ట్రేస్ చేసిన పోలీసులు

కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్‌ను భీమవరం రైల్వే స్టేషన్‌లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప్రమత్తమై హ్యాండ్ బ్యాగులో ఉన్న 110 బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.5000 నగదు బాధితురాలికి ఎస్సై నిన్న అందజేశారు.

February 22, 2026 / 08:47 AM IST

ఐదో రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

TG: యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకృష్ణాలంకారంలో నరసింహస్వామి మురళీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి పొన్న వాహనసేవ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

February 22, 2026 / 08:46 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి

శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్‌ చికెన్ సుమారు ₹265కు, స్కిన్‌లెస్ సుమారు ₹270కు, బోన్‌లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతున్నాయి, మరియు షాపులివ్వే రేట్లు కొంచెం తేడాలతో మారవచ్చని సూచనలున్నాయి.

February 22, 2026 / 08:45 AM IST

దారుణం.. యువకుడిని సజీవదహనం చేశారు!

TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి, సజీవ దహనం చేశారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

February 22, 2026 / 08:45 AM IST

APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

CTR: పలమనేరు ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.

February 22, 2026 / 08:43 AM IST

చెరువులో పడి రైతు మృతి

MDK: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో చోటుచేసుకుంది. స్థనికుల వివరాలు.. గ్రామానికి చెందిన రైతు అల్లాడి శంకర్ (40) నిన్న సాయంత్రం పొలానికి మందులు చల్లి స్నానం చేసేందుకు చెరువులో దిగి గల్లంతయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్ద గాలించారు. ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. భార్య లావణ్య, ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు.

February 22, 2026 / 08:41 AM IST

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవికాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి100, నుంచి 150 లీ, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.

February 22, 2026 / 08:41 AM IST

ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ వెళ్లి తీరుతాం: బీజేపీ చీఫ్

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడ వెళ్లకుండా తనను హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ‘బాన్సువాడలో మా MLAపై దాడి జరిగింది. మా MLA తప్పు చేస్తే నిరూపించండి. మేమే యాక్షన్ తీసుకుంటాం. కాంగ్రెస్ నేతలే కారు ధ్వంసం చేసి.. BJP నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మా కార్యకర్తలు మా కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ వెళ్లి తీరుతాం’ అని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:40 AM IST

యువతలో పక్షవాతం ముప్పు

దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు 45 ఏళ్లలోపు యువతేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పక్షవాతం పడిన వారిలో 3 నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణించడం లేదా తీవ్ర అంగవైకల్యం బారినపడటం వంటివి జరుగుతున్నాయి. మొత్తం రోగుల్లో మహిళలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండగా.. పురుషుల్లో పొగాకు, మద్యపానం వినియోగం అత్యధికంగా ఉందని తేలింది.

February 22, 2026 / 08:40 AM IST

గ్యాస్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు: జేసీ

KKD: గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లను హెచ్చరించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, లీడ్ బ్యాంక్ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్‌తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

February 22, 2026 / 08:37 AM IST

గాంధీ ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా ప్రొఫెసర్ మురళీధర్

HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా అనస్తీషియా విభాగాధిపతి ప్రొ.ఆవుల మురళీధర్‌ను వైద్య ఉన్నతాధికారులు నియమించారు. సూపరింటెండెంట్ ప్రొ.వాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగివచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.

February 22, 2026 / 08:37 AM IST

ఢిల్లీకి బయలుదేరిన OC JAC నాయకులు.

WGL: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేడు నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభలో పాల్గొనడానికి వరంగల్ నుంచి GT ఎక్స్‌ప్రెస్ రైల్లో ఢిల్లీకి ఆర్యవైశ్య సంఘ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు గంద శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల హక్కులు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 08:37 AM IST

‘బిఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపరచాలి’

ASR: అనంతగిరి మండలం కొండిభ పంచాయతీలో ఉన్న బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ మూగబోయిందని తక్షణమే సెల్ సేవలు అందించాలని గ్రామస్తులు బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత వారం రోజులుగా సేవలు నిలిచి పోవడంతో వినియోగదారులతోపాటు పంచాయతీ సచివాలయ కార్యకలాపలు నిలిచిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సెల్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 08:36 AM IST

దలై పేటలో ఏనుగుల గుంపు కలకలం

PPM: కొమరాడ మండలం దలైపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది ఆదివారం ఉదయం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 22, 2026 / 08:32 AM IST