BDK: వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు.
ATP: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని SP జగదీష్ సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపుల్లో ఫేక్ న్యూస్ షేర్ చేసే అడ్మిన్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు నివేదించాలని కోరారు.
BPT: గ్యాస్ కొరత ఉందని ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు గ్యాస్ బుకింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆన్లైన్లో బుకింగ్ కోసం వెతికే వారే లక్ష్యమని, అనుమానాస్పద లింకులు, కాల్స్పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
WGL: న్యూఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు రహదారులకు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయనను కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న నేషనల్ హైవే రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
TG: హైదరాబాద్ అంబర్పేట్లోని రహత్నగర్లో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 2,500 కేజీల కల్తీ పెరుగుతో పాటు.. పెరుగు తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు సీజ్ చేశారు. NR ఎంటర్ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా కల్తీ పెరుగు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
SDPT: హయత్ రెస్టారెంట్లో భోజనంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు వచ్చింది. దీంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్, Slలు శివకుమార్, సత్యనారాయణ, EE అన్వేష్ హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేశారు. వారు రూ. 15,000 జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. 2,05,753 మంది రైతు కుటుంబాలకు రూ.115.81 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
AKP: సబ్బవరం మండలం అంతకాపల్లిలో గ్రామ దేవత ముత్యమాంబ అమ్మవారి పండగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు.
BHPL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని BHPL ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. దళారులు, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని, అలాంటి అక్రమ నిల్వలు, ధరల ఎగబాకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిల్ చివరి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగినున్న నేపథ్యంలో ఇది చివరి సమావేశం కానుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.చివరి సమావేశంలో 21 అంశాలపై చర్చ జరగనుంది.
KMM: అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.
నెల్లూరు నగరంలో విద్యుత్ కష్టాల పరిష్కారానికి గాంధీ పార్క్ వద్ద రూ.5 కోట్లతో 11కేవీ కంటైనర్ సబ్స్టేషన్ పనులు ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం బేస్మెంట్ దశలోనే ఉంది. వేసవి రావడంతో విద్యుత్ అంతరాయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి వల్లూరు వీరబ్రహ్మం శుక్రవారం ఆలయానికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడవీధులు, విశ్రాంతిభవనం, కళ్యాణ వేదిక, నిత్యాన్నదానం కేంద్రంలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారన్నారు.
KRNL: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై గురువారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. మండల ఎంపీపీ వెంకటేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో నీటి కొరత నివారణకు, పారిశుద్ధ్య కార్యక్రమాల సమర్థ అమలుకు చర్య లు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలం సమీపిస్తున్న సందర్భంగా నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
TPT: పాకాలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవాళ పర్యటించనున్నట్లు Dy.MPDO శశికళ తెలిపారు. MPDO కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ‘PM కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకంపై సమావేశం నిర్వహించనున్నారు. మండలంలోని 5,029 మంది రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఖాతాల్లో జమ కానున్నట్లు AO హరిత పేర్కొన్నారు.