• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆంథ్రోపిక్ క్లాడ్.. 10 బిలియన్ డాలర్లు ఆవిరి..!

ఆంథ్రోపిక్ క్లాడ్.. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. అది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. ఈ పోస్టుతో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు 5-9 శాతం మేర కుంగాయి. మొత్తంగా మదుపర్ల సంపద 10 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

February 21, 2026 / 05:24 PM IST

మాజీ MLA సతీమణికి జాతీయ ST కమిషన్ సభ్యుడు నివాళి

HNK: వర్దన్నపేట మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి విజయ ప్రథమ వర్ధంతి కార్యక్రమం హంటర్ రోడ్డులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ చిత్రపటం వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాణాప్రతాప్ తదితరులున్నారు.

February 21, 2026 / 05:24 PM IST

CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన : MLA

WGL: ఖానాపురం(M) బుధరావుపేట గ్రామంలో ఇవాళ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి ఏడాదిలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని తెలిపారు.

February 21, 2026 / 05:23 PM IST

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త నగిరికంటి రమేష్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాబహుకరణ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:23 PM IST

నేను పిలుపునిస్తే.. వేలాది మంది వస్తారు: KVR

TG: కామారెడ్డిలో జరిగింది ఇది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందు ఉందని BJP MLA కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. తాను ఎవ్వరినీ రావొద్దంటేనే.. పరిస్థితి ఇలా ఉందని.. ఒకవేళ తానే పిలుపు ఇస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కాలేజీ భూముల విషయంలో దొంగ ఎవరో.. దొర ఎవరో ప్రజలకు తెలుసన్నారు. రేపట్నుంచి గ్రామాల్లో తిరుగుతాని.. తనపై చిన్న గీత పడినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

February 21, 2026 / 05:22 PM IST

నాటుసారా కేంద్రంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్

HYD: పల్లెచలుక తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎన్ ఫోర్స్ మెంట్, సరూర్ నగర్ డీటీఎఫ్, అమనగల్ ఎక్సైజ్ సిబ్బంది ఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. 8 లీటర్ల నాటుసారా, 580 లీటర్ల బెల్లం పానాకం ధ్వంసం చేశారు. ఇస్లావత్ హిరియా సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, మరో నలుగురిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నారు.

February 21, 2026 / 05:21 PM IST

పల్నాడు పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతం: సీఎం

PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.

February 21, 2026 / 05:21 PM IST

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం: కలెక్టర్

SRD: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

February 21, 2026 / 05:20 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యాధికారి తనిఖీ

NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

February 21, 2026 / 05:20 PM IST

‘విద్యా విహారాలు.. పరిశోధనాసక్తి పెంపొందిస్తాయి’

SDPT: సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బయోటెక్నాలజీ, రసాయన శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో శనివారం ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారాలు విద్యార్థులలో పరిశోధనాసక్తిని పెంపొందిస్తాయని కాలేజ్ ప్రిన్సిపాల్ డా జి. సునీత తెలిపారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

NASO పోటీల్లో సత్తా చాటిన గుంతకల్లు విద్యార్థి

ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తన చాంబర్లో శాలువాతో సత్కరించి సన్మానించి అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

ఢిల్లీలో హైఅలర్ట్.. రెండు IED బాంబులు నిర్వీర్యం

ఉగ్రకుట్రల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో హైఅలర్ట్ జారీ చేశారు. పంజాబ్, కాశ్మీర్‌లలో భద్రతాదళాలు భారీ ప్రమాదాన్ని తప్పించాయి. అమృత్‌సర్‌తో పాటు కాశ్మీర్‌లో లభ్యమైన రెండు IED బాంబులను గంటల వ్యవధిలోనే విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టిన భద్రతాదళాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి.

February 21, 2026 / 05:18 PM IST

తప్పు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: కాటిపల్లి

TG: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. సోమవారం కలెక్టరేట్‌కు వస్తా.. తన తప్పు ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలు అడ్డుకున్నందుకే తనపై కక్ష గట్టారని అన్నారు. తన తప్పు రుజువు చేస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీపై గౌరవంతో ఇన్ని రోజులు మర్యాద ఇచ్చానన్నారు.

February 21, 2026 / 05:15 PM IST

జనసేన సభ్యత్వాలు.. మంత్రి నాదెండ్ల కీలక సూచనలు

AP: జనసేన సభ్యత్వ నమోదు ప్రణాళికపై ఆ పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధక్‌లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోందన్నారు. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు.

February 21, 2026 / 05:13 PM IST

సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు Steam Rice సరఫరా చేయనుంది. ప్రస్తుతం అందిస్తున్న సన్నబియ్యం అన్నం ముద్దగా అవుతుండటంతో, విద్యార్థులకు పొడిపొడిగా, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

February 21, 2026 / 05:10 PM IST