SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు నియోజక వర్గంలోని ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. సారవకోట ఎంపీడీవో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
VKB: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పచ్చని పొలాల్లో రైతు నేస్తాలుగా పిలువబడే కొంగలు సందడి చేస్తున్నాయి. పంటకు నష్టం కలిగించే పురుగులు, కీటకాలను ఆహారంగా తింటూ ఈ కొంగలు రైతులకు రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
JGL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, మార్చి 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
SDPT: హరీశ్ రావుపై కవిత పోటీకి సిద్ధమవుతుందా..? అనే చర్చ సిద్దిపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. BRS నుంచి బయటకు వచ్చిన కవిత, హరీశ్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను పార్టీకి దూరం చేయడంలో ఆయన పాత్ర ఉందని, సిద్దిపేటపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సిద్దిపేట ఎవరి అడ్డా కాదు’ అని కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.
NZB: రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని కోరారు.
NLG: చందంపేట మండలం బీజేపీ నాయకులను శనివారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. AI సమ్మిట్లో మన దేశ పరువు పోయేలా అర్ధ నగ్నంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అరెస్ట్లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజి నాయక్ ఉన్నారు.
TPT: తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. అలాగే నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నడిపిన 46 మందికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. మొత్తంగా 69 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
NTR: విజయవాడలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీలంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.గత జగన్ ప్రభుత్వంలో వేధింపులకు తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు.కోవాబన్ అంశంలో వలికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.
NDL: శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న లింగాలగట్టు గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ పోలయ్యను ఆయన పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
GDWL: నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ వెలుగుచూసింది. ఇటీవల అడవిలో అగ్నిప్రమాదాల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చాయి. ITDA మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వెళ్తుండగా రోడ్డుపై భారీ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో తాబేలును అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.
పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ నియామకాల కోసం యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, స్టడీ మెటీరియల్ సదుపాయాలు కల్పిస్తారు. 17.5-22 ఏళ్ల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఫిబ్రవరి 23లోపు రుద్రమదేవి స్టేడియంలో ఉదయం 6-8 గంటల మధ్య నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
SRD: విదేశాల్లో చదువు కోసం డా. BR.అంబేద్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.in లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు అందిస్తామన్నారు.
MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.
కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.