• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గాంధీ మెడికల్ కాలేజీలో పెరగనున్న క్రిటికల్ కేర్ స్పెషాలిటీ

HYD: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ మెడిసిన్ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, పోస్ట్ ఆపరేషన్, ఇన్ఫెక్షన్, తదితర విభాగాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్‌లో మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లుగా వివరించారు.

February 24, 2026 / 10:45 AM IST

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. సర్వం సిద్ధం..!

MDCL: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు 151 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 ఒకేషనల్ కోర్సులో 1,368, మంది, సెకండ్ ఇయర్ 67,792 జనరల్ విభాగం, ఒకేషనల్ విభాగంలో 1,258 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

February 24, 2026 / 10:44 AM IST

కాకుమాను నూతన ఎస్సైగా హరికృష్ణ

GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి. హరికృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.

February 24, 2026 / 10:44 AM IST

గల్లంతైన మరో యువకుడి మృతదేహం లభ్యం

BPT: బాపట్ల మండలం అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో గత సోమవారం గల్లంతైన ఇద్దరు యువకులలో చందు అనే యువకుడి మృతదేహం మంగళవారం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే, మరో యువకుడు పీటా వంశీ లభ్యం,ఇప్పటికే లభ్యంమైనట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

February 24, 2026 / 10:42 AM IST

డివిజన్‌లో పర్యటించిన కార్పొరేటర్ రాంబాబు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్‌లో కార్పొరేటర్ రాంబాబు మంగళవారం పర్యటించారు. ముందుగా డివిజన్‌లో ప్రతి కుటుంబాలతో వ్యాపారస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవభారత్ సెంటర్‌లోని డ్రైనేజ్ సమస్యలు, మంచినీటి సమస్యను త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 10:42 AM IST

‘ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు’

ASF: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఫస్ట్,సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ. 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఉంటుందన్నారు.

February 24, 2026 / 10:42 AM IST

ACBకి పట్టుబడిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి

AP: పశ్చిమ గోదావరి జిల్లా అటవీ శాఖ సెక్షన్ అధికారి సురేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో అటవీ శాఖ అధికారి సామిల్లును సీజ్ చేశాడు. సీజ్ చేసిన మిల్లును తిరిగి ప్రారంభించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సురేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

February 24, 2026 / 10:41 AM IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురంలో శనిగరపు పుల్లయ్య మృతదేహం పొలం వద్ద మంగళవారం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికితే ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మృతదేహం లభ్యమవడంతో విద్యుత్‌షాక్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 10:40 AM IST

‘ఛలో సెక్రటేరియట్‌’కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

NRML: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఛలో సెక్రటేరియట్‌కు భైంసా ఆర్టీసీ ఉద్యోగులు తరలివెళ్లారు. రెండు ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగులు HYDకి పయనమయ్యారు. 2021సంవత్సరం ఉద్యోగుల పే స్కేల్‌ను శాశ్వతంగా 30 శాతం అమలుపరచి, మా లక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.

February 24, 2026 / 10:37 AM IST

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

SKLM: ఉండవల్లిలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి హాజరయ్యారు. ఈ మేరకు మంత్రి ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు రవికుమార్, శిరీష, రమణ మూర్తి పాల్గొన్నారు.

February 24, 2026 / 10:36 AM IST

తాడూరులో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

NGKL: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే తాడూరు మండలంలో 18.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. కల్వకుర్తి మండలంలో 11.3, అమ్రాబాద్ లో 7.0, పదరలో 4.3, అయినోల్ లో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

సీఎం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

NZB: వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి రూప ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి మంచి ప్రతిభ కనపరిచినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేశ్, ఉపాధ్యాయులు మంచే గణేశ్, మహేందర్ ఉన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

బహిరంగ సభను విజయవంతం చేయండి: ఉషశ్రీ చరణ్

SS: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 1న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.

February 24, 2026 / 10:33 AM IST

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారుల నిఘా

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు, గోధుమల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేదల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘాను ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,081 రేషన్ దుకాణాలపై నిరంతరం పరిరక్షణ ఉంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది.

February 24, 2026 / 10:33 AM IST

డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. 32 మంది డయేరియా బారిన పడ్డారని, 10 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. 22 మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రహదారి మరమ్మతు పనుల వల్ల నీరు కలుషితమైందని ప్రాథమికంగా గుర్తించామని, డయేరియా బాధితుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.

February 24, 2026 / 10:33 AM IST