• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులు చ‌దువులో రాణించాలి: కలెక్టర్

VSP: సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ పథకాలపై వివరించారు. చదువులో రాణించి దేశానికి సేవ చేయాలని సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో నిందితులు అరెస్ట్

ADB: పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఆరుగురు నిందితులు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు నిన్న తెలియజేశారు. పట్టణానికి చెందిన బాధితుడు కనిష్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామన్నారు. అనుమతి లేకుండా షాపు యజమానులు సెల్ ఫోన్లను కొనవద్దని CI సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై CPM ఆగ్రహం

అన్నమయ్య: జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది.

February 28, 2026 / 08:10 AM IST

భారత్-నేపాల్‌ సరిహద్దు మూసివేత

నేపాల్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ద‌ృష్ట్యా MAR 2 నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత-నేపాల్‌ సరిహద్దు మూసివేయనున్నట్లు నేపాల్‌ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. భారత్‌కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్‌ పోస్టులు 5 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని 2 దేశాల పౌరులకు సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

పామూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ప్రకాశం: పామూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను TDP నాయకుడు మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, విధవులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 08:05 AM IST

నేడు చిల్పూరు గుట్టలో స్వామివారి కళ్యాణం

JN: చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఛైర్మన్ శ్రీధర్ రావు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

February 28, 2026 / 08:03 AM IST

దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి

AP: పోలవరం జిల్లాలోని రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి పెద్దపులి చంపేసింది. 20 రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పెద్దపులి సంచరించినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో భయాందోళనకు గిరిజనులు గురవుతున్నారు.

February 28, 2026 / 08:03 AM IST

గన్నవరంలో కూరగాయల ధరలు ఇవే.!

కృష్ణా: గన్నవరంలో శనివారం రోజువారీ కూరగాయల ధరలు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించాయి. టమాటా రూ.14కి లభించగా, వంకాయలు రూ.16-18 వరకు నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ, దోసకాయ రూ.24 చొప్పున, బీట్‌రూట్ రూ.25కి విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ.61, ఫ్రెంచ్ బీన్స్ రూ.51గా ఉండగా, బీర రూ.24, పచ్చిమిర్చి రూ.38గా నమోదైంది.

February 28, 2026 / 08:03 AM IST

ప్రజాస్వామ్యానికే విజయం: ఏఐఎస్ఎఫ్

KMM: వివాదాస్పద అంశాలతో ఉన్న 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని AISF KMM జిల్లా కార్యదర్శి ఇటుకల రామకృష్ణ అన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.

February 28, 2026 / 08:03 AM IST

నేడు సౌందరరాజన్ అంత్యక్రియలు

HYD: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు సౌందరరాజన్ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. ఆలయం వెనుకభాగంలోని గోశాల పక్కన దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుందని తెలిపారు. సౌందరరాజన్ మరణించడంతో చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇవాళ ఆలయం మూసి ఉంటుందని అర్చకులు తెలిపారు.

February 28, 2026 / 08:02 AM IST

కోటంచలో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం

BHPL: రేగొండ మండల కేంద్రంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 28, 2026 / 08:02 AM IST

మార్చి 2న తెలంగాణకు రాహుల్ గాంధీ

TG: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న TGలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 9:20AMకి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.30AM నుంచి 4.30PM వరకు అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో జరిగే DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.

February 28, 2026 / 08:02 AM IST

నిడదవోలులో రూ.105 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్: ఛైర్మన్

E.G: నిడదవోలు మాలకోడులో రూ. 105 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు నాయుడు హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:00 AM IST

కొత్తమ్మ తల్లి ఆలయ ఆదాయం ఎంతంటే..?

SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో హుండీల ద్వారా 93 రోజులకు గాను రూ.6,81,751 లక్షత ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ కె. గోవిందరావు సమక్షంలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. మందసకు చెందిన ఈవో ఎస్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.

February 28, 2026 / 08:00 AM IST

‘స్త్రీ నిధి బకాయలు తక్షణమే రికవరీ చేయాలి’

పెద్దపల్లి జిల్లాలో స్త్రీ నిధి బకాయిలను తక్షణమే రికవరీ చేయాలని డీఆర్డీఓ కాళిందిని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్త్రీనిధి సిబ్బందితో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మార్చి 5లోపు 100% రికవరీ, 100% రుణ ప్రణాళిక పూర్తి చేయాలని తెలిపారు. లేనియెడల వేతనాలు నిలిపివేసి, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 28, 2026 / 07:59 AM IST