HYD: నిత్యం వేలాది మంది పేషెంట్లు, సహాయకులు, సందర్శకులు వచ్చే గాంధీ ఆస్పత్రి ఓపి బ్లాక్ వద్ద క్యాంటీన్ లేకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న క్యాంటీన్ 2 నెలల క్రితం కోర్టు ఆదేశాలతో మూతపడింది. దాంతో ఓపీ బ్లాక్ ఆవరణలో కనీసం టీ, టిఫిన్, నీరు కరవైంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు రోడ్డు దాటి బయటకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వ్యాయాయంతో నిర్మించనున్న సమావేశ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
KDP: ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్’ గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.
TG: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.9గా తీవ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలకు 35 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
BPT: వేదుళ్లపల్లి పరిధిలోని స్టువర్టుపురంలో ఎస్సై భాగ్యరాజు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మన్యం లక్ష్మి అనే వ్యక్తి నుంచి 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని ఎస్ఐ సూచించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.
KMM: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు.
AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు గురువారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఉత్సవ కావిడితో తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం కంకణ ధారణ, అంకురార్పణ, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చారు. HNK కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ను నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL CMDగా హన్మకొండలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే స్నేహ శబరీశ్ను మహబూబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
KNR: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్రం హరిబాబు ఓడిపోయినా తన హామీని నెరవేర్చుకున్నారు. వార్డులో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా రూ. 10,116 ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం యంజాల భాగ్య-వాసుల కుమార్తె శ్రావ్య వివాహానికి హాజరై నగదు అందజేశారు. ఆడపిల్ల పుడితే కూడా రూ. 10,116 మొత్తాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
KRNL: దేవనకొండ(M) కరివేముల గ్రామ శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి రూ.15,000 విరాళం అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాముని పరిపాలన ప్రపంచానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్.కె. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.