• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రం

KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ సెక్రెటరీ జయలక్ష్మి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ సంస్థ మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా శనగలు క్వింటా రూ.5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దిగుబడులు అమ్ముకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:45 AM IST

విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచన

MNCL: ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షా ప్యాడ్, హాల్ టికెట్, పెన్నులను తెచ్చుకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:44 AM IST

ఏప్రిల్ మొదటి నెలలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభం..?

వరంగల్లోని మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో PM మోదీ మామునూర్ విమానాశ్రయంతో పాటు కాజీపేట అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గీసుగొండ మెగా టెక్స్‌టైల్ పార్కులను ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

February 24, 2026 / 08:43 AM IST

మహానందిలో ఆలయ ఉద్యోగి ఆత్మహత్య

NDL: మహానంది గ్రామంలో ఆలయ ఉద్యోగి చల్లగాలి లక్ష్మయ్య సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా?, అనారోగ్య సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

February 24, 2026 / 08:42 AM IST

దూడను చంపిన చిరుత పులి

NZB: నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు.

February 24, 2026 / 08:42 AM IST

మార్చి 13 నుంచి అఖిల భారత స్థాయి నాటికల పోటీలు

W.G: కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని, కళాపరిషత్ నాటికలు ప్రజలకు సందేశాలు ఇచ్చే విధంగా ఉండాలని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మార్చి 13 నుంచి 16 వరకు వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటికల పోటీల పుస్తకాన్ని ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు సోమవారం కళాపరిషత్ ప్రాంగణంలో నిన్న ఆవిష్కరించారు.

February 24, 2026 / 08:41 AM IST

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ విద్యార్థుల ప్రభంజనం

ADB: తొలి రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల గల పిల్లల క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభతో మొత్తం 35 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 08:41 AM IST

‘రైతులకు 10% నిధులు కేటాయించాలి’

NLR: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక సీపీఐ, రైతు సంఘం నాయకులు కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 10% నిధులు కేటాయించాలని అలాగే రూ. 2 లక్షలు పంట రుణాలు రైతులకు ఇప్పించాలని తదితర డిమాండ్లు పొందుపరిచారు.

February 24, 2026 / 08:40 AM IST

మార్కాపురంలో మీకోసం కార్యక్రమం నిర్వహణ

మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు, కనిగిరి DSP సాయి ఈశ్వర యశ్వంత్ పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.

February 24, 2026 / 08:40 AM IST

నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

HYD: నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి.

February 24, 2026 / 08:39 AM IST

మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:38 AM IST

ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

WNP: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాతపల్లికి చెందిన కిషోర్ కుమార్ (25) దుర్మరణం చెందాడు. సోమవారం సాయంత్రం అయ్యవారిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు సరోజినీ ఆసుపత్రికి, అనంతరం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

February 24, 2026 / 08:36 AM IST

సీసీ రోడ్డు, డ్రైనేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడపలో రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తే, నాయకులను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలిసిపోతామేమో కానీ, ప్రజల ఆదర అభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదని తెలిపారు.

February 24, 2026 / 08:35 AM IST

కాకతీయ యూనివర్సిటీ పీజీ పరీక్షలు వాయిదా

HNK: KU పరిధిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు KU పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.COM)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

February 24, 2026 / 08:35 AM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 24, 2026 / 08:33 AM IST