• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్ర మంత్రిని కలిసిన ఆలూరు ఇంఛార్జి

KRNL: విజయవాడలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును ఆలూరు టీడీపీ ఇంఛార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇంఛార్జి చర్చించారు. ఈ భేటీ నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించింది.

February 26, 2026 / 02:02 PM IST

DYSOను కలసిన సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి

NZB: జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన భూలోక విజయ్ కాంత్ రావు ఇవాళ మర్యాద పూర్వకంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను కలిశారు. DYSO మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైక్లింగ్ క్రీడ అభివృద్ధి చేయాలని క్రీడ సంస్థ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

February 26, 2026 / 02:02 PM IST

‘ప్రతి ఒక్కరు బాధ్యతగా పన్నులు చెల్లించాలి’

ELR: దెందులూరులో గురువారం కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. గ్రామస్తులకు పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతపై అవగాహన వివరించడంతో స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ఆన్‌లైన్‌లో హౌస్ టాక్స్‌ను చెల్లించారు. ప్రజలు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతగా పన్నులు చెల్లించాలని వారికి సూచించారు.

February 26, 2026 / 02:02 PM IST

సింగిల్ బ్రిడ్జితో వాహనదారుల అవస్థలు..!

BHNG: మోత్కూర్-గుండాల ప్రధాన రహదారిలోని బిక్కేరు వాగుపై నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన సింగిల్ లైన్ బ్రిడ్జితో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ఈ పాత వంతెనపై తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.

February 26, 2026 / 02:02 PM IST

కానుకుర్తి రిజర్వాయర్ రైతుల వినతి

NRPT: కానుకుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతుల నష్టపరిహారం కోసం సర్పంచ్ నారాయణ ఆధ్వర్యంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరగా.. శివకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తానని తెలిపారు.

February 26, 2026 / 02:01 PM IST

పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

AP: రాష్ట్రంలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. పాల నాణ్యతపై అధికారులు స్పాట్ టెస్ట్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నవారిపై కేసులు పెట్టారు.

February 26, 2026 / 01:59 PM IST

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

AKP: ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లికి చెందిన గొర్లె వరహాలమ్మ(55) ఈనెల 23న స్వగ్రామం నుంచి ఆసుపత్రికి ఆటో బయలుదేరి ఎలమంచిలిలో దిగి అదృశ్యం అయింది. చుట్టుపక్కల బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె బంధువు ప్రసాద్ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై సావిత్రి గురువారం తెలిపారు.

February 26, 2026 / 01:57 PM IST

గంగ-కావేరి అనుసంధానం నా కోరిక: చంద్రబాబు

AP: నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం చేయాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని తెలిపారు. గంగ-కావేరి అనుసంధానం జరగాలన్నది తన కోరిక అని వెల్లడించారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామన్నారు.

February 26, 2026 / 01:56 PM IST

కిర్లంపూడి ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా సాయి బాధ్యతలు

KKD: కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సాయి కిరణ్ గురువారం మండల మెజిస్ట్రేట్‌గా ఫుల్ అడిషనల్ ఛార్జ్ స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

February 26, 2026 / 01:54 PM IST

నేను ఉత్తమ్ అంత సౌమ్యుడిని కాదు: కౌశిక్ రెడ్డి

TG: మంత్రి ఉత్తమ్ కుమార్‌ను తొక్కినట్లు నన్నూ తొక్కాలనుకుంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనను తొక్కడం రేవంత్ వల్ల కాదన్నారు. తాను ఉత్తమ్ కుమార్ అంత సౌమ్యుడిని కాదని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చూసుకుంటానని హెచ్చరించారు.

February 26, 2026 / 01:53 PM IST

ఆ దేవుడు మిమ్మల్ని క్షమించరు: బొత్స

AP: లడ్డూ కల్తీపై కూటమి నేతలు అసత్యాలు చెబుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘దేవదేవుడికి అపచారం చేసిందే కూటమి ప్రభుత్వం.  లడ్డూ కల్తీపై చర్చకు ఎందుకు పారిపోతున్నారు. ఇప్పుడు మీరు పారిపోవచ్చు.. ఆ దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించరు. చర్చ జరిగితే హెరిటేజ్‌పై నిజాలు బయటకు వస్తాయని భయపడ్డారు’ అని విమర్శించారు.

February 26, 2026 / 01:51 PM IST

స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో కమిషనర్ పర్యటన

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక 6వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో పర్యటించారు. ఒక భవనానికి సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్, టౌన్ ప్లానింగ్ నిర్మాణ అనుమతులను పరిశీలించారు. ఎండ్ టు ఎండ్ సి.సి రోడ్డు నిర్మాణ పనులను అత్యంత నాణ్యతతో, నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు.

February 26, 2026 / 01:51 PM IST

కుస్తీ పోటీలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతి

NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డు పరిధిలో హోలీ సందర్భంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన నిర్వహించే కుస్తీపోటీలకు బందోబస్తు నిర్వహించాలని పట్టణ సీఐ వెంకట నారాయణకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెల్లా శంకర్, పడాల భీములు, గుమ్ముల శంకర్ రెడ్డి, పాల్గొన్నారు.

February 26, 2026 / 01:50 PM IST

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: కోమటిరెడ్డి

TG: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. వైద్య విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.

February 26, 2026 / 01:48 PM IST

ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే..

BHPL: కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు.

February 26, 2026 / 01:48 PM IST