• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్ష ఫీజుల నోటిఫికేషన్ విడుదల

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి నిజామాబాద్ అనుబంధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు.

February 20, 2026 / 08:00 PM IST

ఆదిలాబాద్‌లో ఈనెల 24న జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 08:00 PM IST

సఫారీలపై టీమిండియాదే పైచేయి

T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

February 20, 2026 / 08:00 PM IST

‘చలో హైదరాబాదును విజయవంతం చేయాలి’

MNCL: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే చలో హైదరాబాదును విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు అంబటి సువర్ణ కోరారు. శుక్రవారం జన్నారంలోని సీఐటీయు కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు.

February 20, 2026 / 07:59 PM IST

జేబీఆర్ విద్యాసంస్థల్లో ఘనంగా ఫేర్‌వెల్ డే

TPT: పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు “ఫీల్ ది థ్రిల్” నినాదంతో ఫేర్‌వెల్ వేడుకలు నిర్వహించారు. నాగలాపురం ఎస్సై సునీల్, ఎంఈవో-2 యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

February 20, 2026 / 07:59 PM IST

అంకాలపరమేశ్వరి ఆలయంలో కుంభాభిషేకం ప్రారంభం

TPT: సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలోని పునర్నిర్మిత శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, కంకణ ధారణ, యాగశాల కలశ స్థాపన నిర్వహించారు. సాయంత్రం వాస్తు పూజలు జరిపారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా, ఆలయం దీపాలతో అలంకరించబడింది. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.

February 20, 2026 / 07:55 PM IST

BREAKING: దంపతులకు మరణశిక్ష

పోక్సో కేసులో యూపీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మాజీ ఇంజినీర్ రామ్‌భావన్, ఆయన భార్యకు కోర్టు మరణశిక్ష విధించింది. 2010 నుంచి 33 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆ 33 మంది చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పోక్సో ప్రత్యేక కోర్టు పేర్కొంది.

February 20, 2026 / 07:55 PM IST

గ్రామ పంచాయతీకి భూమి దానం

MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోల్కొండ కిషన్ రావు దేశ్ముఖ్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం భూమిని దానంగా అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రావు దేశ్ముఖ్ పేర్కొన్నారు. సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, పూజారి రమణచార్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:53 PM IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

AP: నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటి 64 లక్షలను సీజ్ చేశారు. త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.

February 20, 2026 / 07:52 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు’

కడప జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశించారు. జమ్మలమడుగు, పులివెందుల సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 07:50 PM IST

పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 20, 2026 / 07:49 PM IST

బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు

మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గల విద్యా సంస్థల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాలల సంరక్షణ అధికారి (NIC)ఎం.ఏ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టౌన్‌లో గల డీవీఎం హైస్కూల్, బెలగాం గర్ల్స్ హై స్కూల్, పలు అంశాలపై అవగాహన కల్పించారు.

February 20, 2026 / 07:49 PM IST

అల్లూరి జిల్లాకు 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు

అల్లూరి జిల్లాలోని, గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం స్వచ్ఛభారత్-స్వచ్ఛాంధ్రలో భాగంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు జిల్లాకు వచ్చాయని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ శుక్రవారం తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

February 20, 2026 / 07:46 PM IST

భీంగల్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి

NZB: భీంగల్ మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీలలో మురికి పేరుకుపోవడం వల్ల దోమల బెడద అధికమవుతోందని, దీనివల్ల ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 07:46 PM IST

ఎంవీఐ తనిఖీలు.. ఐదు ఈ-ఆటోలు సీజ్

ప్రకాశం: పామూరులో శుక్రవారం వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని వాహనాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఐదు ఎలక్ట్రిక్ ఆటోలకు పెనాల్టీ విధించి సీజ్ చేశారు. ఎంవీఐ రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.

February 20, 2026 / 07:45 PM IST