RR: షాద్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టాలు పంపిణీ చేశారు. తొలివిడతగా లబ్ధిదారులకు 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. 28 వార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
KMM: మధిర మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు శనివారం వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల వెంబడి పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలు, డ్రైనేజీ మట్టి దిబ్బలు జేసీబీతో గత రెండురోజులుగా తొలగిస్తున్నారు. రజకబజారు వీధిలో రోడ్ పక్కన దట్టంగా పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్యం చేపట్టారు.
KMM: జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
WNP: బీజేపీ పార్టీ ఎంపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ను వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా జిల్లా నాయకులు కలిశారు. అనంతరం పార్టీ గురించి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.
SRPT: పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం వంటి కనీస సామర్ధ్యాలతోపాటు గణితంలో చతుర్వధ ప్రక్రియపై పట్టు సాధించిన ఉపాధ్యాయులు కృషి చేయాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సూచించారు. శనివారం కోదాడ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు పరిశీలించారు.
SRD: కంగ్టి మండలం తుర్కవడ్గం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విద్యాసామాగ్రిని పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కిషన్ పవార్ తెలిపారు. పాఠశాల, విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా దాత రేణీ గ్రేస్, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్యకు పాఠశాల బృందం తరపున HM కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా-158’ చిత్రంపై అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరు వీరాభిమాని అయిన బండ్లన్న ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుందా లేదా పవర్ఫుల్గా ఉంటుందా అన్నది సస్పెన్స్ అయినప్పటికీ, బండ్లన్న మార్క్ డైలాగులు పక్కా అని తెలుస్తోంది.
GDWL: గట్టు మండల నూతన ఏపీఎంగా మారుతి బాధ్యతలు స్వీకరించారు. మండల సమాఖ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, సీసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మారుతి హామీ ఇచ్చారు.
KMR: లింగంపేట మండల విద్యాధికారిగా వంచ అంజల్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆయన, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటివరకు లింగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న గోపాల్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. చీపురుపల్లి సీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14, 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకాల కేంద్ర ఆరోగ్యశాఖ ఇస్తున్న విషయం తెలిసిందే.
KDP: రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కమాలుద్దీన్తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.
MNCL: మందమర్రి మండలం సారంగపల్లి సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మలుపు వద్ద అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
MBNR: మహబూబ్ నగర్ పట్టణంలోని ఐటీఐ/ఏటీసీ(బాలుర)లో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య తెలిపారు. 1.CNC ఆపరేటర్, 2. Electrical Vehicle Service Technician, 3. 3D Printing ఆపరేటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 ఏళ్లు నిండిన వారు అర్హులని, ఉమ్మడి జిల్లా నుంచి అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PDL: రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, డీవీఏపీ యూనిట్ సభ్యులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సీవీఏపీ యూనిట్ సభ్యులు అన్ని నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జీరో పావర్టీ–పి 4 ఫ్రేమ్వర్క్ పై సమావేశం జరిగింది.
KMM: పశువైద్య శిబిరాలను పాడిపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత అన్నారు. శనివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడులో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ ప్రారంభించారు. నోరులేని జీవుల పట్ల సేవాభావం పెంపొందించుకుని పశుగణాభివృద్ధికి తోడ్పడాలని ఇదే పరమాత్ముడి సేవని మున్సిపల్ ఛైర్మన్ పేర్కొన్నారు.