RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలమానీ అరెస్ట్ అయ్యారు. రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలను కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. కోర్టు స్టే పేరుతో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించారు.
VSP: వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా శనివారం డీజిల్ లోకో షెడ్ను పరిశీలించారు. కొనసాగుతున్న కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక మార్పుల పురోగతిని సమీక్షించారు. సిమెన్స్ సంస్థ ద్వారా 300 లోకోమోటివ్ల నిర్వహణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.
BHPL: ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం BHPL, కాటారం డివిజన్లకు చెందిన 50 మంది రైతులను HYDలో జరుగుతున్న “రైతుబడి అగ్రి షో”కు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతికత అవలంబిస్తే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధ్యమని, ఇలాంటి అగ్రి షోలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ పనులపై ఎంపీడీవో ఇమ్రాన్ సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.
NRML: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఐఈవో పరుశురాం శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 23 కళాశాలలో ఉండగా పరీక్షలకు 13125 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం 6652, ద్వితీయ సంవత్సరం 6473 మంది విద్యార్థులు హాజరవుతుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా శిబిరంలో ఓపీ నమోదు, ,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఫార్మసీ కౌంటర్ను సందర్శించి అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరాతీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
MDCL: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్పేట్ హరిజన్ బస్తీలో ముద్దంగుల బాలు (33) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో ఇంట్లో తలుపులు వేసుకుని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడన్నారు.
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అన్ని రకాల సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్చౌహాన్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్కు విచ్చేసిన కేంద్రమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది 3లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కాటన్ లోడుతో వెళుతున్న లారీ, రాంగ్ రూట్లో వస్తున్న మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కల నెరవేరింది అన్నారు.
ASR: పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాను క్లీన్ ఆర్గానిక్ జిల్లాగా ఉంచడమే ప్రధాన ద్యేయమన్నారు. “జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ నినాదంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శనివారం పాడేరు మండలం తుంపాడ జీపీయూ స్కూల్లో నిర్వహించారు. వీధులలో, రోడ్లకు ఇరువైపు పరిశీలించి చుట్టుపక్కల వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు.
VKB: బొంరాస్పేట మండలంలోని గుబ్బడి తండాలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి మంజూరు వచ్చింది. ఈరోజు సర్పంచ్ శాంతి బాయ్, గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి, MGNREGS మెంబర్ నర్సింహులు గౌడ్ అధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, తండా వాసులు మరియు పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.