MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్పల్లిలో శనివారం మంచినీటి పైప్లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.
GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మండల పరిషత్ ఉర్దూ పాఠశాల, ఆంగన్వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
శాసనమండలిలో నిన్న వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని, మండలిలో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు జగన్ హయాంలో ప్రతి అంశంలో దోచుకున్నారని, తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.
RR: షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బసవేశ్వర్ను వీర శైవ సమాజం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, లింగ వర్ణ వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేసి మున్సిపాలిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
KDP: రానున్న ఎన్నికలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం గూడెంచెరువు గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని 20 మోటార్ సైకిల్లు, 8 ఆటలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలపై ,చెడు నడత నడిచేవారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
KRNL:పెద్దకడబూరు మం. బాపురంలో ఆదివారం జరిగే శ్రీ గంగాదేవి రథోత్సవానికి రావాలని జిల్లా YCP ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డిని గ్రామనేతలు కోరారు. ఎమ్మిగనూరులోని భీమా నిలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరేష్, హనుమంతరెడ్డి, ఉచ్చారెడ్డి సహాపలువురు నేతలు పాల్గొన్నారు. రథోత్సవ ఏర్పాట్లపై చర్చించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
VSP: జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుంచి చేపట్టనున్న “సభ్యత్వం నుంచి నాయకత్వం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశానుసారం జిల్లా సీనియర్ నాయకుడు రాజు గౌడ్ శనివారం పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు స్థానిక సాధక్లను సంప్రదించి “ఉద్యమి” సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.
NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ రాజశేఖర బాబు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర ప్రజా అవగాహన సైకిల్ యాత్ర తిరువూరు సర్కిల్ను దాటి జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్దకు ఈరోజు ప్రవేశించింది. ఈ యాత్ర కంభంపాడు గ్రామం నుండి ప్రారంభమై వత్సవాయి వరకు కొనసాగింది. డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ టేకింగ్, రైటింగ్పై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు SMలో వైరలవుతున్నాయి. ‘బుజ్జిగాడు’ కంటే ‘ఏక్ నిరంజన్’లో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఆ క్యారెక్టర్ను ఎలా చేయాలా అని ఎక్కువగా ఆలోచించేవాడినని ప్రభాస్ తెలిపాడు. పూరీ డైలాగ్స్, రైటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని, ఆయనలాంటి రైటింగ్ ప్రపంచంలోనే ఎవరూ చేయలేరని, ఎవరి వల్ల కాదని తెలిపాడు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకలు నిర్వహించి, బంగారు,వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి సింధూరం, ఆకు, తులసితో పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిత్య హోమం చేశారు.
HYD: SLBC సొరంగం ప్రమాదం జరిగి ఏడాదికావస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా శ్రేయస్సుపై శ్రద్ధపెడితే ఇలాంటి విషాదాలు జరగవని ట్వీట్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలోకానీ సొరంగం పనుల్లోగాని ఎటువంటి పురోగతి లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు.
KMM: మధిర మున్సిపల్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన కోన ధని కుమార్ని కోన వారి కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సాధించిన ఈ విజయాన్ని కుటుంబ గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కోన ధని కుమార్ స్పష్టం చేశారు.
ASF: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారాం శనివారం ప్రకటనలో తెలిపారు. నిత్యం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.
NLR: అక్కడ జనసేన సైలెంట్ అయ్యిందా?.. ఎన్నికల ముందు హడావుడి చేసిన జన సైనికులు ఇప్పుడు ఏమయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఇదే.. నాయకులను సమన్వయం చేసే నాయకుడు లేకపోవడంతోనే జనసేనకు ఈ కష్టం వచ్చిందని పలువురు మాట్లాడుతున్నారు. అది కాక రెండేళ్లుగా జిల్లా అధ్యక్షుడు నియమించకపోవడం కూడా పార్టీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపిందట.
T20 WCలో ఇవాళ న్యూజిలాండ్-పాక్ మధ్య తొలి సూపర్-8 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గత రికార్డుల ప్రకారం ఇరుజట్ల మధ్య పోరు పోటాపోటీగానే( 49 మ్యాచుల్లో 23-24) ఉండనుంది. అయితే గత సిరీస్(2015 మార్చ్)లో PAKను కివీస్ 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. మరి ఒకే మైదానం(కొలంబో)లో ఆడుతున్న PAK ఇవాళ NZపై రాణిస్తుందో లేక గత సరీస్ మాదిరే కివీస్ ముందు చతికిలపడుతుందో చూడాలి.