• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మున్సిపల్‌లో ఉర్దూ బోర్డు కోసం డిమాండ్

MBNR: జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయంలో ఉర్దూ భాషలో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉర్దూ మాట్లాడే వారు అధికంగా ఉన్నందున రెండో అధికార భాషను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వెంటనే ఉర్దూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 11:48 AM IST

అంతర్జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో ఆర్టీసీ ఉద్యోగి సత్తా

KNR: యూఏఈలోని అబుదాబిలో ఓపెన్ మాస్టర్ గేమ్స్ విలువిద్య (ఆర్చరీ) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆర్టీసీ KNR జోనల్ వర్క్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న కూన కిషన్ పాల్గొని సత్తా చాటాడు. ఆర్చరీ విభాగంలో 40-50 వయస్సులో 50 మీటర్ల టార్గెట్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా కూన కిషన్‌ను ఆర్టీసీ వీసీ ఎండి వై.నాగిరెడ్డి బస్ భవన్‌లో శాలువా కప్పి అభినందించారు.

February 21, 2026 / 11:48 AM IST

‘మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: సోనాల మండలంలోని దేవల్ నాయక్ తాండకు చెందిన గ్రామ పెద్దలు నెరడిగొండలోని MLA నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 11:48 AM IST

కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ. 8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ టవర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు రూపొందించారు.

February 21, 2026 / 11:47 AM IST

మున్సిపాలిటీ బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్

SRCL: వేములవాడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పుల్కం రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజు అభిమానులు తెలిపారు.

February 21, 2026 / 11:47 AM IST

లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 11:45 AM IST

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట నియోజకవర్గ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి నమ్మకాన్ని నిలబెట్టడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:43 AM IST

మంచినీటి కోసం పైప్ లైన్ ఏర్పాటు

MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్‌పల్లిలో శనివారం మంచినీటి పైప్‌లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.

February 21, 2026 / 11:43 AM IST

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మండల పరిషత్ ఉర్దూ పాఠశాల, ఆంగన్‌వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:42 AM IST

YCP నేతల తీరు దారుణం: మంత్రి కొల్లు

శాసనమండలిలో నిన్న వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని, మండలిలో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు జగన్ హయాంలో ప్రతి అంశంలో దోచుకున్నారని, తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

February 21, 2026 / 11:42 AM IST

‘పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలి’

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బసవేశ్వర్‌ను వీర శైవ సమాజం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, లింగ వర్ణ వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేసి మున్సిపాలిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

February 21, 2026 / 11:40 AM IST

పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

KDP: రానున్న ఎన్నికలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం గూడెంచెరువు గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని 20 మోటార్ సైకిల్లు, 8 ఆటలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలపై ,చెడు నడత నడిచేవారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

February 21, 2026 / 11:39 AM IST

బాపురం రథోత్సవానికి YCP ఉపాధ్యక్షుడికి ఆహ్వానం

KRNL:పెద్దకడబూరు మం. బాపురంలో ఆదివారం జరిగే శ్రీ గంగాదేవి రథోత్సవానికి రావాలని జిల్లా YCP ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డిని గ్రామనేతలు కోరారు. ఎమ్మిగనూరులోని భీమా నిలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరేష్, హనుమంతరెడ్డి, ఉచ్చారెడ్డి సహాపలువురు నేతలు పాల్గొన్నారు. రథోత్సవ ఏర్పాట్లపై చర్చించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

February 21, 2026 / 11:38 AM IST

జనసేన సభ్యత్వ నమోదుకు పిలుపు

VSP: జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుంచి చేపట్టనున్న “సభ్యత్వం నుంచి నాయకత్వం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశానుసారం జిల్లా సీనియర్ నాయకుడు రాజు గౌడ్ శనివారం పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు స్థానిక సాధక్‌లను సంప్రదించి “ఉద్యమి” సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 11:38 AM IST

జగ్గయ్యపేటకు చేరుకున్న డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ

NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ రాజశేఖర బాబు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర ప్రజా అవగాహన సైకిల్ యాత్ర తిరువూరు సర్కిల్‌ను దాటి జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్దకు ఈరోజు ప్రవేశించింది. ఈ యాత్ర కంభంపాడు గ్రామం నుండి ప్రారంభమై వత్సవాయి వరకు కొనసాగింది. డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.

February 21, 2026 / 11:38 AM IST