• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సంగంబండ కాలువపై వంతెన కోరుతూ ఆందోళన

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ సంగంబండ కాలువపై వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీరు పారుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రవాణా, వ్యవసాయ పనులు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 05:32 PM IST

చంద్రగిరిలో పశువుల పండుగ సంబరాలు

TPT: చంద్రగిరి పట్నంలో పశువుల పండుగ సంబరాలకు ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మిట్టమీద గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని పశువుల పండుగను తిలకించారు. ఈ సందర్భంగా పండుగను వీక్షించడానికి తరలివచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలను, కార్యకర్తలను అభిమానంగా పలకరించారు.

February 22, 2026 / 05:32 PM IST

‘కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు’

WNP: రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు శివ హెచ్చరించారు. చీర్ల చందర్ ని అవమానించేలా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఆధారాలు లేకుండా బురదజల్లడం మానుకోవాలని, బీసీల ఐక్యతకు భంగం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు పలువురు నిరసన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:32 PM IST

రేపు కామారెడ్డి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణి ప్రజలు సద్వినియోగం పట్టుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:31 PM IST

నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేత

NLG: పెద్దవూర మండలం కోమటికుంట తండాలో ప్రభుత్వ భూమిలోని విలువైన చెట్లను అక్రమార్కులు యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టం నిబంధనలు తుంగలో తొక్కిన వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రమేయంతోనే చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

February 22, 2026 / 05:31 PM IST

కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం దర్శనం నిమిత్తం కర్నూలుకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:30 PM IST

చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ముందుకు: వరుణ్

ATP: శ్రీవారి చిత్రపటాన్ని రాజకీయ స్వార్థానికి వాడుతూ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం వైసీపీ పతనానికి నాంది అని కూటమి నేతలు మండిపడ్డారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఇతర నేతలు మీడియా సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తిప్పికొడతామని హెచ్చరించారు.

February 22, 2026 / 05:30 PM IST

గూడూరు: గుప్తనిధుల కోసం తవ్వకాలు.!

MHBD: గూడూరు మండలంలోని రాళ్లవాగు బ్రిడ్జి సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు అటువైపు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. JCB సహాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసి ఉన్న ప్రదేశం కనిపించడంతో వారు అవాక్కయ్యారు.

February 22, 2026 / 05:30 PM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి: MLA

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 05:30 PM IST

క్లీన్ సిటీ మనందరి బాధ్యత: ఛైర్‌పర్సన్

SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 29వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, సంత్ నిరంకారి మిషన్ వారు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇళ్లలోనే వేరుచేసి అందజేయాలన్నారు. 

February 22, 2026 / 05:30 PM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు: మంత్రి

KMM: ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల నూతన చైర్మన్లు, కౌన్సిలర్లు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించిన మంత్రి, ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని మరియు పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు.

February 22, 2026 / 05:30 PM IST

సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో రూ. 4 కోట్ల 20 లక్షల నిధులతో 33/11KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు లేకుండా నిరంతర సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.

February 22, 2026 / 05:30 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

BDK: కొత్తగూడెం మేదర బస్తీలో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంచార జాతులుగా ఉన్న బంజారాలను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏకతాటిపైకి తెచ్చారని గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి భోగ్ భండారో పూజలు నిర్వహించి నివాళులర్పించారు.

February 22, 2026 / 05:28 PM IST

‘ఇందిరమ్మ ఇల్లు బిల్లులో సాంకేతిక లోపాలే కారణం’

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని, సాంకేతిక లోపాలతోనే కొన్ని, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లులు నిలిచిపోయాయని ఆమె సృష్టం చేశారు.

February 22, 2026 / 05:28 PM IST

266 మందికి సీఎంఆర్‌ఎఫ్ సహాయం మంజూరు

PDPL: మంథని నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 1,00,09,000 విలువైన 266 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని 43, ముత్తారం 44, రామగిరి 44, కమాన్‌పూర్ 23, పాలకుర్తి 8 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78 మందికి చెక్కులు అందనున్నాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 05:28 PM IST