ASF: వాంకిడి మండలం ఖీరిడి గ్రామ ZPSS పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు వివరించారు.
కోనసీమ: మండపేటలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండపేట, ద్వారపూడి, రూరల్ మండలం గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. కేశవరంలో భారీ వర్షం కురిసింది. మండపేటలో వర్షం వలన డ్రైన్ లలో నీరు రోడ్పై ప్రవహించింది. ద్వారపూడిలో డ్రైన్లు మూసుకొని పోవడంతో రోడ్ మీద నీరు నిలిచిపోయింది. మండపేటలో పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్పై ప్రవహించింది.
ASR: జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు ఆర్.హేమంత్ కుమార్ బుధవారం పాడేరు వచ్చారు. పాడేరు పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయనను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో చేపడుతున్న శాంతిభద్రతల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలపై కలెక్టర్ వివరించారు.
GDWL: రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా చేసుకోవాలని ధరూర్ మండల ఏఈఓ స్వరూప సూచించారు. పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులంతా నమోదు పూర్తి చేయాలని కోరారు. రిజిస్ట్రీ చేసిన వారికే ప్రభుత్వం నగదు జమ చేస్తుందని తెలిపారు. వివరాలు నమోదు చేయని అర్హులైన రైతులకు ఆర్థిక సాయం నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు.
MBNR: బాలానగర్ మండల సర్పంచుల సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. పోచమ్మగడ్డ సర్పంచ్ జె.కుమార్ నాయక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సునీత, చెన్నమ్మ, శ్రీను, కోశాధికారులుగా జంగమ్మ, వసంత, అరుణ, రాజు, వెంకటేష్ నాయక్ ఎన్నుకోబడ్డారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
BHPL: రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడు పసుల రాజుకు భాగిర్తిపేట గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల తిరుపతి గౌడ్ రూ. 5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదని పేర్కొన్నారు.
JN: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడికందుల సదానంద చారి అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉండగా,వారసుడు అంటే కేవలం కొడుకే కాదు కూతురు కూడా అని నిరూపిస్తూ పెద్ద కూతురు ముందుకు వచ్చి తండ్రి పార్థివ దేహానికి తలకొరివి పెట్టింది. గ్రామస్థులు ఆమె ధైర్యాన్ని అభినందించారు.
KMR: ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం తుప్పు పట్టిన 5 వాహనాలకు నిర్వహించిన వేలంలో 10వేల రూపాయల ఆదాయం వచ్చిందని స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి. షాకీర్ అహ్మద్ తెలిపారు. కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ. హనుమంతరావు ఆదేశాల మేరకు గత 12సంవత్సరాల క్రితం NDPS కింద పట్టుబడిన 5 తుప్పు పట్టిన వాహనాలకు వేలం నిర్వహించడం జరిగింది.
KMM: భూదానం భూములపై సమగ్ర విచారణ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వెల్లడించారు. నిజంగా నిరుపేదలే ఉన్నారా లేదా అని అంశంపై రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డబ్బులు వసూలు చేసి ప్లాట్లు విక్రయించిన వ్యక్తులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 15 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: జిల్లాలో డయేరియా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, అవసరమైన వైద్య సిబ్బంది, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, స్వచ్ఛత పాటించాలని సూచించారు.
W.G: మొదటి రోజు అసెంబ్లీ ‘ఆట విడుపు’ క్రీడా పోటీలలో సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్, కబడ్డీ ఆటలను ఆడారు. అలాగే ఆటల్లో సరదాగా ఆయన తొడ కొట్టారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రఘురామ అన్నారు.
ఏఐకి టీసీఎస్ భయపడదని ఆ సంస్థ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఏఐ మార్పులకు అనుగుణంగా తమ కంపెనీ విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అంతేగానీ.. కొత్త టెక్నాలజీ చూసి భయపడబోమని అన్నారు. ఏఐ టూల్స్ను వినియోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో చేసే విధానంపై తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నట్లు కృతివాసన్ వెల్లడించారు.
MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.