సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన క్లాసిక్ మూవీ ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 40 లక్షలకు దక్కించుకున్నారట. అద్భుతమైన డైలాగ్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో అలరించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
JN: జనగామ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని అన్నారు. బీజేపీ జిల్లా నేతలు పాల్గొన్నారు.
W.G: భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం పాత్రల ఎంతో ఉందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం-తాడేరు రోడ్డులో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారం ఆర్చ్ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.
KDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా నీచ రాజకీయాలకు వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో భూతులు మాట్లాడిన వారికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భూపేష్ రెడ్డి అన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతానగరం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో శనివారం విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని సరుకుల నిల్వలను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో చూపిస్తున్న సరుకు నిల్వలకు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నిల్వలకు ఏమాత్రం పొంతన లేదని దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
TG: మోతీలాల్ నెహ్రూ వేల కోట్లు ఆస్తులను దేశం కోసం త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో ఏళ్లు జైలులో ఉన్నారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్నాళ్లకే గాంధీజీని కోల్పోయామన్నారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అజిత్ పవార్ ప్రయాణించిన లేజర్ జెట్ విమాన యజమాని VSR సంస్థకి టీడీపీతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు.
NZB: వికారాబాద్లో నేటి నుంచి పది రోజుల పాటు నిర్వహించే జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ఉమ్మడి NZB జిల్లా నేతలు హాజరయ్యారు. NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, KMR జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీనియర్ నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు.
HYD: కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేశ్ లాకప్ డెత్ జరిగి నేటికి 95 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఓయూలో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాజేశ్ లాకప్ డెత్పై సీఎం మౌనం వీడాలని అన్నారు. PS సీసీ ఫుటేజ్ని పరిశీలించి రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.
నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
TG: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకముందు అనంతగిరి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు.
TPT: సత్యవేడులో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీల శిక్షణలో ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ సొంత ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెరువుల వేలం, సంతలు, భవన అనుమతులు, లైసెన్సులు, అద్దెలు వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రభుత్వ గ్రాంట్లపై మాత్రమే ఆధారపడకుండా పన్నులు సకాలంలో వసూలు చేయాలని అన్నారు.
KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమం శనివారానికి 98వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల మోనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన పోరాటంపై నిర్లక్ష్యం తగదని, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని JAC నాయకులు కోరారు.
E.G: కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామానికి చెందిన ఆకుల రాజకుమారికి వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.