KNR: తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోట శ్యాం కుమార్ ప్లకార్డ్ పట్టుకుని నిరసన చేపట్టారు. వాహనం కొనుగోలు చేసినప్పుడే లైఫ్ ట్యాక్స్ కట్టానని, అయినా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టోల్ ప్లాజాలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు CCI ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగతో కలిసి కలెక్టర్ కె. హరితని కలిసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని శ్యామ్ నాయక్ తెలిపారు.
ASF: జిల్లాలో ఎండలు మొదలయ్యాయి. ఓ వైపు ఉదయం చలి ఉంటూనే మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లో శుక్రవారం 32 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే, వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
BPT: బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు ZP హైస్కూల్లో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ 208 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ సైకిళ్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టీచర్స్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలో నూతన నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. అర్చకుల నివాస గదులు, నిత్య హోమాలు, అక్షరాభ్యాసాల కోసం నిర్మించనున్న ప్రత్యేక మండపానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున రావు కలిసి భూమి పూజ నిర్వహించారు.
ప్రకాశం: సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమాన అవకాశాలు ప్రతి పౌరుడికి అందేలా చేయడమే సామాజిక న్యాయ దినోత్సవం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. భీమన్న గుడి చారిత్రక సంపదగా, స్థానికులను ఆకట్టుకుంటోంది.
E.G: స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ శాఖలకు విధాన రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు సేవలు ముందస్తుగా అందించేందుకు అవసరమైన సమగ్ర డేటాను సేకరించడం సర్వే ప్రధాన ఉద్దేశమన్నారు. RTGS డేటాను పూర్తి స్థాయిలో సక్రమంగా నమోదు చేయాలన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని 15వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, సేవలను మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు కనిపించే విధంగా డిస్ప్లే బోర్డులో ప్రదర్శించాలన్నారు. విధులకు సక్రమంగా హాజరు కావాలన్నారు.
NZB: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య మంలో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మృతి చెందిన వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.
‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరికి పేరు?A) గోపాలకృష్ణ గోఖలేB) దాదాభాయ్ నౌరోజీC) సర్దార్ వల్లభాయ్ పటేల్D) మదన మోహన మాలవీయ నిన్నటి ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు?జవాబు: బూర్గుల రామకృష్ణారావు
MLG: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కన్నాయిగూడెంలో సమావేశం జరిగింది. వాసంపెల్లి నరసింహారావు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు.
WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జాతర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ఫిబ్రవరి 23 నుంచి జాతర ప్రారంభం కావనున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
KRNL: ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉందని ఇవాళ నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ తెలిపారు. బీపీ, షుగర్, ఒబిసిటీ కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత కిడ్నీ మార్పిడి జరుగుతుందని, మార్పిడి అనంతరం సాధారణ జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. ఆదోనిలో గురు, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం అచ్చుతాపురంలో ఫార్మా కంపెనీలను సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, క్వాలిటీ ఇష్యూరియన్స్ డిపార్ట్మెంట్, వాటర్ ప్యూరిఫికేషన్ డిపార్ట్మెంట్లను సందర్శించారు.