JGL: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గల మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి నమూన పరీక్షపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారిని నాగమణి మట్లాడుతూ.. సేంద్రియ, సహజ వ్యవసాయం నేలలో సరైన ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. రసాయన ఎరువులు వాడకంతో నేలలో సారం తగ్గిపోతుందన్నారు. అలాగే నేలలో జరిగే చర్యల గూర్చి విద్యార్థులకు వివరించారు.
MNCL: మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ప్రోహిబీషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గురవయ్య తెలిపారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించే వేలంలో ఆసక్తి గల వారు పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
MBNR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న (రేపు) పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ , 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎన్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని అన్నారు.
E.G: ఇటీవల హాస్పటల్స్లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 61 మందికి రూ.37,19,880 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు కాగా చెక్కులను శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
MHBD: మరిపెడ మండల కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని నాణ్యత ప్రమాణాలతో వెంటనే పూర్తిచేయాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆసుపత్రి 100 ఏళ్ల ప్రజలకు ఉపయోగపడాలన్న పనుల్లో నాణ్యత ముఖ్యమని కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోయినా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలను వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
HNK: జీవించే హక్కును హరిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ అన్నారు. 11వ డివిజన్ భద్రకాళి ఆలయం సమీపంలో ఉన్న చెరబండరాజు నగర్లో DBF నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగ బద్దంగా అధికారులు తమ విధులను సక్రమంగా వినియోగించి దళిత కుటుంబాలకు మంచి పాలన అందించాలని కోరారు.
AKP: సబ్బవరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తను వేరు చేయడంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇనుము ప్లాస్టిక్ అట్టపెట్టెలు కాగితాలు తదితర వాటిని పొడి చెత్తగా పరిగణిస్తారని ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు, కార్యదర్శి ఆనందరావు అన్నారు. సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలని సూచించారు.
PPDL: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి అర్హులైన మైనారిటీలు మార్చి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నరేష్ కుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు, ముఖ్యమైన పత్రాలను సంబంధిత ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట గ్రామానికి చెందిన రోహిత్ రానాకు CMRF ద్వారా అందిన సాయం ఊరటనిచ్చింది. ఇటీవలే అనారోగ్యం బారినపడి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరిన రోహిత్ పరిస్థితిని తెలుసుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వానికి విన్నవించి ఎల్ఓసీ కాపీని మంజూరు చేయించారు.
కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని రైల్వే ట్రాక్పై శుక్రవారం ఓ యువకుడి మృత దేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఫ్రెండ్స్తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.
SDPT: భద్రాచల దేవస్థానం నుంచి వచ్చిన 3 క్వింటాల వడ్లు గోటి తలంబ్రాలకు ఇవాళ అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధిం చేశామన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
VSP: భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా పెందుర్తి సమీపంలోని సంకల్ప కళా గ్రామంలో సహజరంగుల అద్దకంపై కార్యశాల నిర్వహించారు. నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు చేనేత ఉత్పత్తులు, లక్క బొమ్మలు, సంప్రదాయ ఆహార తయారీ విధానాలను వీక్షించారు.