ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం టీడీపీ నేతలు పంపిణీ చేశారు. మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఇంటి వద్దకే వెళ్లి ఒకరికి రూ.72,650వేలు, మరొకరికి రూ.45 వేలు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం అన్నారు.
NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఇవాళ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత తెలిపారు. సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఛైర్మన్గా, వార్డు సభ్యుడు బంగారెక్క ప్రసాద్ వైస్ ఛైర్మన్గా, అంగన్వాడీ టీచర్ సునీత కన్వీనర్గా, హెచ్ఎం అరుణ, ఆశా వర్కర్లు, తల్లులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఆధ్వర్యంలో రూ. 13 కోట్ల వ్యయంతో డైట్ క్యాంపస్ అభివృద్ధి మరియు డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్గ్రేడేషన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ హాజరై శంకుస్థాపన చేశారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న జగదీష్(37) అనే వ్యక్తి, రాత్రి భోజనంలో కాకరకాయ కూర నచ్చలేదన్న నెపంతో తన తల్లి సుమిత్రను విచక్షణారహితంగా కొట్టి చంపాడు. భార్య వదిలేయడంతో తల్లి వద్దే ఉంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్షణికావేశం, వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
AP: వినుకొండలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలించారు. 561 స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల చెక్కును అందించారు. అనంతరం మొక్కజొన్న వేస్ట్తో తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు.
BDK: ఇల్లందులో జామాయిల్ కర్రలు నరకడానికి వెళ్లిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు విద్యుత్ షాక్కు గురై శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఐటీసీ జామాయిల్ సప్లై చేసే ఓ కాంట్రాక్టర్ ఆ మృతికి తనకేమీ సంబంధం లేదని ఎటువంటి అగ్రిమెంట్లు లేవని తీర్చి చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నంలోని బస్టాండ్ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, డీఎం పెద్దిరాజులు పాల్గొన్నారు.
BPT: కొల్లూరు మండలం వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7,87,294లు మంజూరయ్యాయి. మొత్తం 17 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో ఈ సహాయాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా అందజేశారు. పేదల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి: లింగంపేట మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సక్రు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచులు అభినందించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: మట్టపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప ఆగ్రో ఏజెన్సీలో నిషేధిత బయో పురుగుమందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుండి తెచ్చిన బయో రసాయనాలను స్థానికంగా విక్రయిస్తూ, ముఖ్యంగా వరి పంటలకు విస్తృతంగా పిచికారి చేస్తున్నారనే వాదనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు ఆ షాప్పై రైడ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్సై ఎం. అప్పలరాజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు.
CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణ-ఆంధ్ర, స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. తహసీల్దార్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు ఇంట్లో అవసరం లేని వస్తువులను ఇచ్చి అవసరమైనవి పొందవచ్చని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, దేవస్థాన అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
NGKL: కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో మంత్రి జూపాలి కృష్ణారావు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాం వంటి వసతులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.