• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చీటింగ్ కేసు.. శిల్పాశెట్టి భర్తకు బెయిల్‌

బిట్‌కాయిన్ మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. ఆయనకు ముంబైలోని PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చింది.

February 20, 2026 / 04:40 PM IST

మెసెంజర్ వినియోగదారులకు షాక్

డెస్క్‌టాప్ యాప్ తర్వాత, ఏప్రిల్-2026లో Messenger.com వెబ్‌సైట్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇకపై బ్రౌజర్‌లో మెసెంజర్‌ను నేరుగా ఫేస్‌బుక్ ద్వారానే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. చాట్ సేవలను తిరిగి ప్రధాన ఫేస్‌బుక్‌లోకి అనుసంధానించే క్రమంలో మెటా ఈ మార్పులు చేస్తోంది. అయితే, మొబైల్ యాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

February 20, 2026 / 04:39 PM IST

గిరిజన జీవనోపాధిపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

విశాఖలోని ICAR-CMFRI రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజనులకు శుక్ర‌వారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపు, జలాశయాలు–చెరువుల శాస్త్రీయ వినియోగంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మత్స్య సంపద, ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

February 20, 2026 / 04:38 PM IST

‘పెద్దపల్లిలో ఈనెల 24న జాబ్ మేళ’

PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సాక్సెస్ ప్రాజెక్ట్ LLP కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న PDPL జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 18-36 సం.ల మధ్య గల అభ్యర్థులు ఈనెల 24న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.

February 20, 2026 / 04:38 PM IST

‘కార్యాలయాలను నాగారం బంగ్లాలోనే నిర్మించాలి’

SRPT: నాగారం మండలానికి మంజూరైన తహశీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ పక్కా భవనాలను నాగారం రహదారి బంగ్లాలో నిర్మించాలని శుక్రవారం గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన రహదారిపై ఉండడం వల్ల పరిపాలన సులభంగా ఉంటుందని అఖిలపక్ష నాయకులు అన్నారు.

February 20, 2026 / 04:36 PM IST

బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

BPT: కర్లపాలెం మండలం పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్యానెల్ లాయర్ దగ్గుమల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తికాకుండా వివాహం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.

February 20, 2026 / 04:36 PM IST

వనపట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NGKL: నాగర్‌కర్నూల్ సమీపంలోని వనపట్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న గన్నోజ్ సురేష్ చారి(40) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సోమశిలకు వెళ్తున్న కారు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 04:36 PM IST

కోడూరు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత

అన్నమయ్య: మహాశివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని గుండాలకోన, చిట్వేల్ మండలంలోని ఎండ్రకాయ కోనలో అటవీ శాఖ అధికారులు సేవలందించారు. వీరితో పాటు కోడూరు సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు ప్రతిభ చూపడంతో రేణిగుంట DSP శ్రీనివాసరావు విశిష్ట ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా సేవలందించినందుకు ప్రశంసించారు.

February 20, 2026 / 04:34 PM IST

వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి: వడ్ల రాజు

KNR: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కూలీల వేతనాన్ని రూ.600కు పెంచాలని కోరారు. పనిస్థలాల్లో తాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని అన్నారు.

February 20, 2026 / 04:34 PM IST

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెరిసిన ఖేడ్ వాసి

SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజరావ్ భూపాల్ బహుమతి ప్రదానం చేశారు. సాజిద్ విజయం పట్ల 4వ బేటాలియన్ కమాండెంట్ D.శివప్రసాద్ రెడ్డి, అధికారులు అభినందించారు.

February 20, 2026 / 04:34 PM IST

వైసీపీ విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది: గొట్టిపాటి

AP: అసెంబ్లీలో బడ్జెట్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ రంగం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.30 వేల కోట్లు భారం వేసిందని ఆరోపించారు.

February 20, 2026 / 04:34 PM IST

SBI సీఎస్ఆర్ నిధులతో రేణిగుంట PHCకి వైద్యపరికరాలు

TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో స్టేట్ బ్యాంక్ ముందుంటుందని చెప్పారు.

February 20, 2026 / 04:34 PM IST

ఆ క్షణాలు భావోద్వేగభరితం: కోమటిరెడ్డి

TG: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ.. ఆనాటి పోరాట స్మృతులు నేటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. దాశరథి గారు అన్నట్లు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే మాటలు ఇవాళ అక్షర సత్యాలవుతుంటే మనసు గర్వంతో నిండిపోతోందన్నారు.

February 20, 2026 / 04:33 PM IST

ఆహ్వాన పత్రిక అందజేసిన డిప్యూటీ సీఎం

KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు.

February 20, 2026 / 04:33 PM IST

‘ఉద్యోగ భద్రత కల్పించాలి’

PPM: గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న “ఫీడర్ అంబులెన్స్” సర్వీస్‌ల టెండర్ రెన్యువల్ చేయాలని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేశారు. శుక్రవారం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన గిరి శిఖర గ్రామాల నుంచి గర్భిణీలు, రోగులను PHCకు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు.

February 20, 2026 / 04:32 PM IST