సత్యసాయి: పరిగి మండలం శాసనకోటలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ‘కాఫీ విత్ క్యాడర్’ నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ గత జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తోందని విమర్శించారు.
కడప: ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు ఆదివారం ఎరుపెక్కాయి. భారీ ర్యాలీ అనంతరం జరిగిన సభలో రాష్ట్ర నేతలు ఎస్.వెంకటసుబ్బయ్య, చలసాని వెంకటరామారావు పాల్గొన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ల అమలుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక హక్కులు, ఆశా-అంగన్వాడీల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పాలకులపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.
కర్నూలు: జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. గత ఫిర్యాదుల స్థితిగతుల కోసం ప్రజలు 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
RR: తంగడపల్లి మజీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.
TG: రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలంతా తలో చెయ్యి వేసి ఒక వెయ్యి కోట్లు పోగు చేసి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం లాగా మారిందని తామెన్నో సార్లు చెప్పిన విషయం.. ఇప్పుడు సాక్షాత్తూ రేవంత్ రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడని విమర్శించారు.
NRKL: కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగ గరిష్ఠ ధర క్వింటాలుకు రూ.10,399 పలికినట్లు అధికారులు తెలిపారు. ఇతర రకాల ధరలు రూ.10,009, రూ.4,360గా నమోదయ్యాయి. కందులు అన్ని రకాలు రూ.7,309 ధరకు అమ్ముడయ్యాయి. మార్కెట్కు మొత్తం 807.90 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది.
MHBD: తొర్రూరు మండలంలోని కొమ్మనపల్లి తండాలో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు ఆదివారం స్థానిక సర్పంచ్ భూక్యా స్వరూప నరేందర్ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని, గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.
HNK: యాదవ నగర్లో నాల్గోవ డివిజన్ కార్పొరేటర్ రఘుపై నేడు దాడి జరిగింది. రఘుపై దాడి చేస్తుండగా తమ్ముడు లక్ష్మణ్ అడ్డుకోవడంతో లక్ష్మణ్ చెయ్యికి గాయాలయ్యాయి.బాధితులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ లోని శివనగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ ద్వితీయ వార్షిక మహోత్సవాలు రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య తెలిపారు. ఇవాళ ఆలయ ప్రాంగణంలో వార్షిక మహోత్సవాల కరపత్రలను ఆవిష్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో HNK జిల్లా కేంద్రంలో మార్చి 5వ తేదీన ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA PO చిత్ర మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల నిరుద్యోగులు ఉదయం 10:00 లోపు గిరిజన భవన్కు విద్యఅర్హత పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.
WG: నరసాపురం(M)రుస్తుంబాద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. జిన్నూరు చెందిన తాడి జోషి (20), గొట్టుముక్కల శామ్యూల్ రాజు (25) ఇద్దరు యువకులు బైక్పై పేరుపాలెం బీచ్ సందర్శించి తిరిగి వస్తున్నట్లు వారు తెలిపారు. రుస్తుంబాద సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఓ వ్యాన్ వీరిని బలంగా ఢీకొనగా గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు.
ప్రకాశం: ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా దోర్నాల మండలం గంటవానిపల్లి ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, అనంతరం మార్కాపురం పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అధికారులతో సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్తో యాడ్స్ చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టి.. రూ.కోట్లు ఆఫర్ చేశాయని తెలిపాడు. అయితే, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది కావనే ఉద్దేశంతో పవన్ వాటిని తిరస్కరించారని చెప్పాడు.