• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కివీస్ vs పాక్ మ్యాచ్‌కు వర్షం గండం..?

సూపర్-8లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ‘ఆక్యూవెదర్’ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఈరోజు రాత్రి 80 నుండి 100 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే, ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే రెండు జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి.

February 21, 2026 / 03:23 PM IST

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు: ఎమ్మెల్యే

ATP: అనంతపురం మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆదేశించారు. యార్డులో పాలకవర్గంతో నిర్వహించిన సమావేశంలో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. చీనీ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, కష్టపడి పంట తెచ్చే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

February 21, 2026 / 03:21 PM IST

‘హే బల్వంత్’ ఫస్ట్ డే కలెక్షన్స్

టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఎలాగైనా తండ్రి బిజినెస్‌ను తాను టేకప్ చేయాలనే కొడుకు కథతో ఈ మూవీ తెరకెక్కింది.

February 21, 2026 / 03:21 PM IST

పీఎం సూర్య ఘర్‌ పథకంపై కలెక్టర్‌ సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో పీఎం సూర్య ఘర్‌ పథకంపై జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ శనివారం విద్యుత్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 11,987 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్‌ రూఫ్‌ టాప్‌లు మంజూరైనట్లు తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తామని తెల...

February 21, 2026 / 03:20 PM IST

గుత్తిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KRNL: గుత్తి మండల కరటికొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ఆచారి అనే వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలానికి చెందిన ఆయన తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 21, 2026 / 03:20 PM IST

గాంధీ భవన్ ముట్టడికి BJYM నేతల అరెస్ట్

NGKL: కల్వకుర్తిలో BJYM నాయకులను శనివారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్ ముట్టడికి BJYM రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అరెస్టు అయినవారిలో ధన్నోజు నరేష్ చారి, కుంభం చందు ముదిరాజ్, రాజశేఖర్, వంశీ, శివ ఉన్నారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. BJYM శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 03:20 PM IST

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కాయకల్ప టీమ్

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని కాయకల్ప టీం వైద్యాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల వసతులు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ హర్షవర్ధన్, సిబ్బంది ఉన్నారు.

February 21, 2026 / 03:19 PM IST

‘ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలి’

GDWL: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి హృదయ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

February 21, 2026 / 03:18 PM IST

‘పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలి’

SRCL: పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలని, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు.

February 21, 2026 / 03:18 PM IST

కామారెడ్డిలో ఉద్రిక్తత.. అసలేం జరిగింది?

TG: కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వెంకట రమణారెడ్డి రూ. 6 కోట్లకు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. దీనిపై స్పందించిన వెంకటరమణ రెడ్డి షబ్బీర్‌కు దమ్ము ధైర్యం ఉంటే తన కుటుంబాన్ని తీసుకుని చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఇక చూస్కో షబ్బీర్.. నేను రెడ్డినో బుడ్డినో చూపిస్తా. నీ సంగతి చూస్తా’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

February 21, 2026 / 03:18 PM IST

ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి: జాన్ వెస్లీ

జనగామ 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన బూడిది జ్యోతి గోపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నేతలను కలిశారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాన్ వెస్లీ కౌన్సిలర్‌కు సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:17 PM IST

మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి: మంత్రి

MLG: మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

February 21, 2026 / 03:15 PM IST

‘వివేకా హత్య.. నాటకాల రాయుడు నాటకాలు ఆడారు’

AP: లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు ఉన్నారు. వైఎస్ వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం నెట్టారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారు’ అని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:15 PM IST

ఫార్మా రంగంలో భారీ విక్రయం

స్విస్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ఏజీ భారత్ నుండి తప్పుకుంటోంది. నోవార్టిస్ ఇండియాలో తనకున్న 70.68% వాటాను రూ.1,446 కోట్లకు క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. అదనంగా 26% వాటా కోసం షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లతో ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ భారీ డీల్ పూర్తి కానుంది. దీంతో భారత వ్యాపారానికి నోవార్టిస్ ఫుల్‌స్టాప్ పెట్టనుంది.

February 21, 2026 / 03:12 PM IST

మెరిసే చర్మం కోసం అరటిపండు!

అరటిపండు ఆరోగ్యానికే కాదు, సహజ సౌందర్యానికి అద్భుత ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపును ఇస్తాయి. బాగా పండిన అరటి గుజ్జును ఫేస్ ప్యాక్‌గా వాడితే ముడతలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ మొటిమల మచ్చలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

February 21, 2026 / 03:12 PM IST