• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యుత్ షాక్‌తో మేక, గొర్రె మృతి

JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురంలో విద్యుత్ షాక్‌తో రెండు మూగజీవాలు మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వెనుక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్ల ఐలయ్యకు చెందిన ఒక మేక, ఒక గొర్రె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయన్నారు.

February 24, 2026 / 07:36 AM IST

లింగపాలెం మద్యం దుకాణాల్లో తనిఖీలు

ELR: లింగపాలెం మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలను పరిశీలించడంతో పాటు, ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి వివరాలను సరిచూశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు.

February 24, 2026 / 07:35 AM IST

భూ సమస్యల్ని పరిష్కరించాలని వినతి

RR: భూ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేశారు. మాజీ ఎంపీటీసీ గౌర మల్లేశ్ ప్రజలందరిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు. సభ్యులు శశిధర్ రెడ్డి, నరసింహ, ఇతరులన్నారు.

February 24, 2026 / 07:35 AM IST

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ఉండాలి: ఎంపీ

కోనసీమ జిల్లా డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు సోమవారం సాయంత్రం అమలాపురంలో ఎంపీ గంటి హరీశ్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

February 24, 2026 / 07:35 AM IST

‘సత్ప్రవర్తనతో జీవించాలి’

కడప: ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ నిన్న విస్తృత కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి అవగాహన కల్పించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవనం గడపాలని సూచించారు.

February 24, 2026 / 07:35 AM IST

ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి దంచికొడుతున్న వర్షం

HYD: GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తిరిగి తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్‌నగర్‌లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్టీవో కాలనీ, శాస్త్రిపురం, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైంది.

February 24, 2026 / 07:35 AM IST

NSRS నిర్వాసితులకు CPT టెస్ట్ మినహాయింపు

NDL: శ్రీశైలం (NSRS) ప్రాజెక్టు నిర్వాసితుల ప్రత్యేక పునరావాస విధానం కింద నియమితులైన జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్‌లకు CPT టెస్ట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా కారుణ్య నియామకాలు కాకుండా ప్రత్యేక విధానంలో సోమవారం చేసిన నియామకాలని వెల్లడించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు.

February 24, 2026 / 07:32 AM IST

డయేరియా కలకలం.. 19 మందికి అస్వస్థత

AP: శ్రీకాకుళం జిల్లాకేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. 24 గంటల్లోనే 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ముఖ్యంగా కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి తోట తదితర ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలను సమీక్షించారు.

February 24, 2026 / 07:30 AM IST

జిల్లా గ్రంథాలయ 2026-27 వార్షిక బడ్జెటు ఆమోదం

యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అవైస్ చిస్తీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘దివ్యాంజన్ సెక్షన్ ‘ను ప్రారంభించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖకు పంపాలని తీర్మానించారు.

February 24, 2026 / 07:29 AM IST

రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు..?

TG: యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా సాయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. సంక్రాంతికి, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినా.. ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. నిన్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

February 24, 2026 / 07:27 AM IST

మార్కెట్ కమిటీల సమస్యలు పరిష్కరించాలని వినతి

NZB: తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.

February 24, 2026 / 07:26 AM IST

శతవాహన యూనివర్సిటీకి భూమి కేటాయింపు

SDPT: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 36 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే చిగురు మామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3.12 ఎకరాలను దేవాదాయ శాఖకు కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు.

February 24, 2026 / 07:25 AM IST

నేడు జిల్లాలో మెగా జాబ్ మేళా

MBNR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం,నిర్మాన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ (మహిళల)లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఎస్సెస్సీ, అంతకంటే పై విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత తమ విద్యాసర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

February 24, 2026 / 07:24 AM IST

విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలి: PDSU

ADB: జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలని PDSU జిల్లా కార్యదర్శి కుమ్ర అశోక్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోతే సంబంధిత యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో పరీక్ష రాసే అవకాశం కల్పించిందని తెలిపారు.

February 24, 2026 / 07:23 AM IST

డిగ్రీ పరీక్షల్లో 12 మంది విద్యార్థులు డిబార్

ATP: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ముగ్గురు, ఎస్ఎల్ఎన్ కళాశాలలో ఆరుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.

February 24, 2026 / 07:23 AM IST