• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి’

KNR: సుడా పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నగరం, పరిసర గ్రామాల ప్రధాన రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు పెద్దపీట వేయాలన్నారు. వర్టికల్ గార్డెన్లు, పార్కుల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.

February 24, 2026 / 09:00 AM IST

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన నూనవత్ నవీన్‌పై నమోదైన పోక్సో కేసులో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నిన్న విధించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు నిరూపితమవడంతో పాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 09:00 AM IST

హాల్ టికెట్లు ఇవ్వకపోతే.. కఠిన చర్యలు!

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని అధికారులు సూచించారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్రలపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాల్‌కు అనుమతించాలని తెలిపారు. విద్యార్థులకు కళాశాల మేనేజ్ మెంట్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 24, 2026 / 08:59 AM IST

నారాయణపేటలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు

NRPT: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నారాయణపేటలో ప్రతిష్టిత వ్యక్తుల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సభలో సంఘ సభ్యులు దేశభక్తి, హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిని కాపాడుతూ సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమం స్థానికులలో చైతన్యాన్ని సృష్టించింది.

February 24, 2026 / 08:59 AM IST

లోకేశ్‌తో చీపురుపల్లి ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం

VZM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

February 24, 2026 / 08:57 AM IST

చిత్తూరులో రాత్రి 10 తర్వాత దుకాణాలు మూసివేత

చిత్తూరులో రాత్రి 10 గంటలలోపు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని తాలూకా, బీఎన్ఆర్ పేట ఎస్ఐలు ఆదేశించారు. దొడ్డిపల్లి, పెనుమూరు క్రాస్, మురుకంబట్టు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 24, 2026 / 08:54 AM IST

అభివృద్ధి పనులు మార్చిలోగా పూర్తి చేయాలి: మేయర్

WGL: నగరంలో జనరల్ ఫండ్‌తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. వేసవి సమయంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.

February 24, 2026 / 08:54 AM IST

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వా ఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:53 AM IST

ఈ నెల 28 న మండల సర్వసభ్య సమావేశం

VZM: ఈ నెల 28న వంగర మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశ జరగనుందని MPP ఉత్తరావెల్లి సురేశ్‌ ముఖర్జీ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక MPDO కార్యాలయంలో మాట్లాడుతూ… శనివారం ఉదయం 10:30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో రావాలని సూచించారు.

February 24, 2026 / 08:52 AM IST

విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి: సతీష్ గౌడ్

MHBD: విద్యార్థులు పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ గౌడ్ అన్నారు. గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్థులకు పెన్నులు, పరీక్ష ఫ్యాడ్లు పంపిణీ చేశారు. పరీక్షలంటే విద్యార్థులు భయం, ఆందోళన విడాలని పేర్కొన్నారు.

February 24, 2026 / 08:51 AM IST

600 ఎకరాల భూకబ్జాపై ఎమ్మెల్యే ధ్వజం

MBNR: బీఆర్ఎస్ నేత ఒకరు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ఆరోపించారు. కొండకల్, మోకిల ప్రాంతాల్లో 1,100 ఎకరాల గిరిజనుల భూములు కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. త్వరలోనే వీటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 08:50 AM IST

బాలానగర్‌లో పెరిగిన మొబైల్ వాడకం.. అశ్రద్ధ చేయకండి!

MDCL: ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని డాక్టర్ సువర్ణ, డాక్టర్ రమణ మహర్షి తెలిపారు. బాలానగర్, ప్రకాష్ నగర్, సూరారం సహా అనేక ప్రాంతాల్లో వివిధ ప్రజారోగ్య సంస్థలు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాయి. వృద్ధులు, యుక్త వయసు, చిన్నపిల్లలు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 08:50 AM IST

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

కడప: అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం రాత్రి చిన్నచౌక్ ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. మోడిఫైడ్ సైలెన్సర్లు వాడినా.. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

February 24, 2026 / 08:49 AM IST

28నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ATP: జిల్లాలో మార్చి నెల పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయనున్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నగదు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 2.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.123 కోట్లు పంపిణీ కానున్నాయి. ఆ రోజున అందుకోలేని వారు మార్చి 2న సచివాలయాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 08:49 AM IST

పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం, భీమడోలు నారాయణపురం జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపవరం సీఐ రజిని కుమార్ పర్యవేక్షణలో పోలీసులున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:49 AM IST