KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఈ నెల 24, 25, 26 తేదీల్లో విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ముఖ్య సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం తెలిపింది. 27వ తేదీ నుంచి మళ్లీ యథావిధిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం వెల్లడించింది.
CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం పుంగనూరు రాంపల్లి సమీపానగల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రిలే దీక్షలు చేపట్టారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
BHPL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, డిజైనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని BHPL జిల్లా చేనేత & జోలి శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీకాంత్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు సమీపంలో రోడ్డు భద్రతపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
VSP: అమరావతి సచివాలయంలో సింహాచలం దేవస్థానం భూ వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు విశాఖ ఎంపీలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజులు పాల్గొని భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు వెల్దుర్తిలో నేటీతో 2వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్మికులు దీక్షలను కొనసాగిస్తున్నారు. 2వ రోజు దీక్షలను చిన్న వ్యాపారస్తుల కర్నూలు కమిటీ సభ్యుడు రామాంజనేయులు ప్రారంభించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
చాలామంది ముఖంపై పెట్టే శ్రద్ధ కాళ్లు, చేతులపై పెట్టకపోవడంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారుతుంటాయి. ఈ సమస్యను నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. రోజుకు రెండుసార్లు అలోవెరా జెల్ రాస్తే నలుపు తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్, పంచదార మిశ్రమంతో స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
TG: HYD అంబర్ పేటలో కుటుంబం ఆత్మహత్య తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందన్నారు. అయితే అప్పులిచ్చినవారు బెదిరించినట్లు తమకు అనుమానం ఉందన్నారు. ముందు భార్యను చంపిన రామ్ రాజ్.. తర్వాత ఆయన ఉరి వేసుకుని, కొడుకు చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
KRNL: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 101వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, అశోకానంద రెడ్డి, రఘురామయ్య, కృష్ణమూర్తి, కమతం వెంకటేష్ దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని JAC నాయకులు డిమాండ్ చేశారు.
AP: అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. ఆకతాయిలను గుర్తించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. రజియా హుసేన్ పేరుతో జిల్లాలోని అన్ని కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని కోర్టుల వద్దకు డాగ్ స్క్వాడ్తో వెళ్లి సోదాలు చేస్తున్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చిపల్లి కాయ ధర రూ.5,500, క్వింటాల్ సూక పల్లికాయ ధర రూ.9,300, క్వింటాల్ మక్కలు (బిల్టి) ధర రూ.19,50, క్వింటాల్ పసుపు ధర రూ.12,000గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
RR: మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జాతీయ పరీక్షల్లో కేశంపేట(M) తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన హనితేజరెడ్డి సత్తా చాటారు. JEE మెయిన్లో 99.63% మార్కులు సాధించి తన ప్రతిభ చాటాడు. మారుమూల ప్రాంతంలో చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఆయన విజయంపై గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
VKB: మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు అయ్యప్ప కాలనీలో రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు నీరు వెళ్లడంతో ఈ మార్గాన వెళ్లే వాహనాలు ప్రజలు కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సంబంధిత వార్డు కౌన్సిలర్ స్పందించి ఈ సమస్యని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్కు డేట్, టైం ఖరారైంది. ఫిబ్రవరి 25న ఉదయం 10:14 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్గా నటిస్తున్నారు.
BPT: వైద్య ఖర్చులకు పేదలు అప్పుల పాలు కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం రేపల్లె క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ.19.09 లక్షల విలువైన చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.