PPM: క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి జిల్లా స్థాయి ఎంపిక నర్సిపురం ZP హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈనెల 23న పార్వతీపురం, సీతానగరం,బలిజిపేట,24న గుమ్మలక్ష్మీపురం,కురుపాం, జియమ్మవలస,25న గరుగుబిల్లి, కొమరాడ,వీరఘట్టం,26న భామిని, సీతంపేట,పాలకొండ,27 సాలూరు, పాచిపెంట, మక్కువ వారు హాజరుకావాలన్నారు.
VKB: పర్యాటక ప్రాంతమైన అనంతగిరి క్షేత్రానికి వస్తున్న సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యేకంగా రెండు సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు ఈ వాహనాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
TG: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే బాంబు ఉందని మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగంతకులు మళ్లీ బాంబు ఉన్నట్లు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ కోర్టులో ఉన్న సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి తనిఖీలు చేపట్టింది. కాగా, ఇటీవల బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే.
VZM: ఉత్తరాంధ్రలో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను,రైతులను,కార్మిక కుటుంబాలను ఆదుకునే దిశగా రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక చర్చ జరిగేలా చూడాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. ఈ మేరకు ప్రభుత్వ పరిశ్రమలు కార్యదర్శి డా ఎన్.యువరాజ్, రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ వి.వెంకటరావు లను శుక్రవారం సచివాలయంలో కలసి వారికి వినతిపత్రం అందజేశారు.
PDPL: ఓదెల మండలంలోని గుండ్లపల్లి, సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సేవా కేంద్రాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను సంబంధిత కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులు సన్మానించారు.
TPT: హైదరాబాద్కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళంగా చెక్కును అందజేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో దాత కుటుంబ సభ్యులను అభినందించారు.
MDK: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. శుక్రవారం మండలంలోని కొనాయిపల్లిలో రైతు తప్పేట సాయిబాబా వెదజల్లే పద్ధతిలో వేసిన వారి నాటును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు విభిన్న పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. గంజాయి మత్తులో ఓ కిరాతక కొడుకు కన్నతండ్రినే కడతేర్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర సత్తయ్య(60), తన కుమారుడు బాలకృష్ణ (34) మధ్య కుటుంబ విషయాల్లో తగాదా మొదలైంది.ఆగ్రహంతో మత్తులో ఉన్న బాలకృష్ణ తండ్రిని కర్రతో కొట్టడంతో సత్తయ్య మృతి చెందాడు.
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
HYD: గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న HYDలో ‘పార్కింగ్’ సమస్య ఇప్పుడు సగటు జీవికి శాపంగా మారింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవు. ఉన్నచోట అక్రమ వసూళ్లు దడ పుట్టిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు GHMC స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా నటి మానస వారణాసి ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా.. ప్రభాస్ సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు. ‘నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్ను అనుభవించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని మనసులో మాట బయటపెట్టాడు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవు...
VSP: కలెక్టర్ ఆఫీస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా శ్రీ వెంకటేశ్వర వాటర్ సప్లైకి చెందిన వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగించింది. స్పీడ్ బ్రేకర్ వద్దే వాహనం నుజ్జునుజ్జు కావడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా? తగిన తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
SRD: కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల ప్రగతికి నాంది కావాలని కొండాపూర్ ఎంఈవో దశరథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందించాలన్నారు.
AP: YCP అధినేత జగన్ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కలిశారు. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లేందుకు జగన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రహ్మానందం.. జగన్ని చూసి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.