• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నవశక్తి దేవతల ఆలయ సముదాయం పునఃప్రారంభం

VSP: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరయ్యారు.

February 20, 2026 / 01:30 PM IST

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

TPT: ఎర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ నర్స్‌–01, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నీషియన్‌–02 పోస్టులు కలిపి మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాల కోసం https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలన్నారు.

February 20, 2026 / 01:28 PM IST

‘అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’

KMR: రాజంపేట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

February 20, 2026 / 01:28 PM IST

బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ కౌంటర్

TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కేంద్రమంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారనేది అవాస్తవం అని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపిన ఘనత కాంగ్రెస్‌దే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

February 20, 2026 / 01:27 PM IST

జిల్లాస్థాయి భజన పోటీలో మిడ్జిల్‌కు రెండో బహుమతి

MBNR: జడ్చర్ల మండలం కుర్వగడ్డ పల్లి గ్రామంలోని శ్రీ పరుశవేధిశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మిడ్జిల్కి చెందిన శ్రీ మాత ఇద్దమ్మ దేవి భజన మండలి రెండో బహుమతి సాధించింది. నిర్వాహకులు విజేతలకు రూ.80,106తో పాటు మెమొంటో అందజేసి అభినందించారు. భక్తుల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

February 20, 2026 / 01:27 PM IST

ప్రగతి కాంతులతో విరజిముతున్న కాలనీలు

RR: నందిగామ గ్రామపంచాయతీలో కాలనీలు ప్రగతి కాంతులతో విరజిమ్ముతున్నాయి. సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆదేశాల మేరకు ఏడవ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో వార్డులో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.

February 20, 2026 / 01:26 PM IST

‘అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి’

E.G: అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కరువైందని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లజర్లలో మండల బజారు జట్టు వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది. పాలకవర్గాలకు ఓట్లు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై లేకపోవడం బాధాకరమన్నారు.

February 20, 2026 / 01:26 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

VKB: తాండూరు పట్టణ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్‌తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో లబ్ధిదారకు అందజేయున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.

February 20, 2026 / 01:26 PM IST

ప్రయత్నమే విజయానికి మార్గం: సీపీ

KMM: ప్రయత్నమే విజయానికి మార్గమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ – 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆవరణలో నిర్వహించారు. ఈ రాష్ట్రస్థాయి అర్చేరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

February 20, 2026 / 01:25 PM IST

81వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్‌ లో ముంపునకు గురి అవ్వద్దని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 81 రోజులకు చేరుకున్నాయి. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ ను రద్దు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు మా భూములు మాకు కావాలని, మా ఇండ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.

February 20, 2026 / 01:24 PM IST

అమీర్పేట్లో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ మళ్లింపులు

HYD: అమీర్పేట్‌లో నీలగిరి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మైత్రివనం జంక్షన్ నుంచి సత్యం థియేటర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపుకి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.

February 20, 2026 / 01:23 PM IST

గుత్తిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

ATP: గుత్తి పట్టణ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బసీనేపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పని నిమిత్తం గుత్తికి బైక్ మీద వచ్చాడు. బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 01:23 PM IST

సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ నిరసనలు

SKLM: సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంపద పంపిణీలో అందరికీ సమానంగా జరగాలని జిల్లా పార్టీ నాయకులు తిరుపతిరావు అన్నారు. కార్మికులకు పనిగంటలు తగ్గించి తగిన వేతనాన్ని చెల్లించాలన్నారు. సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:21 PM IST

గ్రామాల సమగ్రాభివృద్ధికి సహకరించాలి: MLA

HNK: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజలు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తరాలపల్లి అభివృద్ధికి సహకరిస్తానని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 01:19 PM IST

యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు

CTR: పుంగనూరు పట్టణంలోని చంద్రకాంత్ వీధిలో యూరియా కోసం ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్‌లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సకాలంలో రైతులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

February 20, 2026 / 01:19 PM IST