• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పీలేరు పట్టణంలో దారుణం

అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 07:30 AM IST

నేడు ఫుడ్ కమిషన్ బృందం పర్యటన

KMR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం నేడు KMR జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉ.9:30 గం.కు KMR పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఉ.10:30 గం.కు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేసి,11 గం.కు ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.12 గం.కు అంగన్వాడి సెంటర్ ను,1 గం.లకు రామారెడ్డి PHCకీ వెళ్తారు.

February 20, 2026 / 07:28 AM IST

అన్వేష్ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్..?

యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. ‘అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని CPని కలుస్తా. అలాగే పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతా. హిందువులను అవమానించిన అతడికి శిక్ష పడేలా చేస్తా’ అని తెలిపింది. దీంతో అన్వేష్ యుట్యూబ్‌ కూడా బ్లాక్ అవుతుందా అని SMలో చర్చ జరుగుతోంది.

February 20, 2026 / 07:28 AM IST

కోడిపందాలపై దాడి.. నలుగురు అరెస్ట్

E.G: నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామ శివారులో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను సమిశ్రగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,000 నగదుతో పాటు ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.

February 20, 2026 / 07:27 AM IST

‘6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

KRNL:  AP మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి ఇవాళ తెలిపారు. ఈనెల23 నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ ప్రారంభమవుతుందని, మార్చి 31లోగా విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ఆప్లికేషన్లను సమర్పించాలన్నారు.

February 20, 2026 / 07:25 AM IST

పెదకాపవరంలో పర్యటించిన RWS అధికారులు

W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో గ్రామంలో గురువారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. గ్రామంలోని మంచినీటి చెరువు, ఫిల్టర్ బెడ్లు, సంపులు, మైక్రో యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారుడు ప్రభాకర్ రావు, బ్రౌసు సంస్థ సభ్యులు డాక్టర్ సుధాకర్ శ్రీధర్, డీఎల్పీవో దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 20, 2026 / 07:25 AM IST

నేడు మధురవాడ జోన్‌లో నీటి సరఫరా నిలిపివేత

VSP: మధురవాడ జోన్‌లో శుక్రవారం తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. గంభీరం వద్ద 700 మి.మీ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వార్డు 6, 7లోని సాయిరాం కాలనీ, కొమ్మాది, బక్కన్నపాలెం, మిధిలాపురి వుడా కాలనీ, పాత మధురవాడ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ కోసం సంబంధిత ఏఈలను సంప్రదించాలని సూచించారు.

February 20, 2026 / 07:25 AM IST

జమ్మిచేడు జమ్ములమ్మ దివ్య మంగళ స్వరూపంగా

GDWL: లోకపావని, చల్లని తల్లి జమ్ములమ్మ అమ్మవారు నేడు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారనారు.

February 20, 2026 / 07:25 AM IST

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా వికాస్ కుమార్

PDPL: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ యాదవ్‌ను నియమించారు. హైదరాబాద్‌లో జరిగిన యూనియన్ 21వ త్రైవార్షిక ప్రతినిధుల మహా సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల వికాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 07:25 AM IST

‘రైతులకు నష్టపరిహారం చెల్లించాలి’

ASR: జీకేవీధి మండలం మంగళపాలెం నుంచి గుణయలంక వరకూ జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో కాఫీ మొక్కలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ మొక్కలు పోతున్నాయన్నారు. అధికారులు కాఫీ మొక్కలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

February 20, 2026 / 07:24 AM IST

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

ATP: బ్రహ్మసముద్రం మండలం నంజాపురంలో తులసి అనే మహిళ మెడలో ఉన్న బంగారపు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గురువారం ఆమె కళ్యాణదుర్గం నుంచి నంజాపురానికి స్కూటీలో బయలుదేరింది. గొంచిరెడ్డిపల్లి, ఐదుకల్లు గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లో వచ్చి మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 20, 2026 / 07:23 AM IST

నేడు నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగ మేళా

SKLM: నగరంలో నెహ్రూ యువ కేంద్రంలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధ ఓ ప్రకటనలో తెలిపారు. 85 ఖాళీల భర్తీకి ఇంటర్ ఆపై విద్యార్హత కలిగి, 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 07:23 AM IST

చెరబండరాజు నగర్ దళిత వాసులకు రక్షణ ఆదేశాలు

HNK: భద్రఖాళీ దేవాలయ ప్రాంతంలోని చెరబండరాజు నగర్ కాలనీ దళిత వాసుల సమస్యలను మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గురువారం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ డా: జస్టిస్ శామీర్ అక్తర్ దృష్టికి తీసుకెళ్లారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 07:23 AM IST

జిల్లా వ్యాప్తంగా విస్తృత విజిబుల్ పోలీసింగ్

కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు, గస్తీలు కొనసాగుతున్నాయి. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

February 20, 2026 / 07:22 AM IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్‌లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 20, 2026 / 07:21 AM IST