NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నిత్య అన్నదాన పథకం కోసం గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ వాస్తవ్యులు శ్రీ ముప్పవరపు రమేష్ కుమార్, శ్రీమతి మాధవి లత దంపతులు విరాళం అందజేశారు. ఈ మేరకు వారు తమ కుమారుడు UASలో నివసిస్తున్న శ్రీ మెగా హర్ష ముప్పవరపు పేరిట రూ.5,01,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలను అభినందించారు.
చంద్రుని ఉపరితలంపై శాస్త్రవేత్తలు తాజాగా 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. దీంతో మొత్తం పగుళ్ల సంఖ్య 2,634కి చేరింది. చంద్రుని అంతర్భాగం చల్లబడుతుండటంతో అది కుచించుకుపోతోందని, ఆ ఒత్తిడి వల్లే పగుళ్లు ఏర్పడుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో చంద్రునిపై కంపనలు(Moonquakes) వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,56,497 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 323 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 15 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2875 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.
ATP: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి కోరారు. ఇంటర్మీడియట్ గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. మార్చి 9- 12 వరకు agnipathvayu.cdac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నూతన మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారం, కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు.
BHNG: బీబీనగర్ మండలం రహీంఖాన్గూడెంలో శ్రీ పద్మావతి అలివేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారు దివ్య విమాన రథోత్సవం ద్వారా గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు హారతులు, భక్తిశ్రద్ధలతో స్వాగతించారు.
VZM: మెరకముడిదాం(మం) సోమలింగాపురంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ 604 విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
NZB: జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సంఘం సంయుక్త కార్యదర్శి గంట విప్లవ్ కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాలులో 2026 సంవత్సర కాలమాణిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
AP: మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో కూటమి పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జగన్ ఆదేశాలతోనే జరిగిందని స్పష్టంగా కనబుతోందని చెప్పారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
VSP: బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం(విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.
TG: రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
CTR: పలమనేరు విద్యుత్ సబ్ స్టేషన్లో శనివారం మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్టు డీవైఈఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించి సహకరించాలని కోరారు.
BDK: చర్ల BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన ఇవాళ జరిగింది. భద్రాచలం నియోజకవర్గం సీనియర్ నాయకులు మానే రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులలో ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అనుమానితులను మొబైల్ స్కానింగ్ పరికరాలతో తనిఖీ చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా.. చాలా మంది ఎదురుకాల్పుల్లో మరణించారు. మిగిలిన వారూ అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే.